రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న వరల్డ్ వైడ్గా రామ్ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ…“దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూశాక అర్థమైంది. రాగిణి ద్వివేది…