ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘CM పెళ్లాం’.రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్మీట్ను నేడు చిత్ర యూనిట్ హైదరాబాద్లో నిర్వహించింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు? సినిమా ద్వారా ఈ ప్రశ్నను నేను అడుగుతున్నా. కనీసం ఈ సినిమా తర్వాత అయినా అది ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నా. ఎమ్మెల్యే కాస్త బిజీగా ఉండి బయట తిరుగుతున్న సమయంలో ఇంటికి పెద్ద సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి వచ్చిన వ్యక్తులను ఎమ్మెల్యే పెళ్లాం ఒక…