మైటీ ఒక్ పిక్చర్స్ పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ’సి 202’. మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి మనోహరి కె ఎ నిర్మాత. పూర్తి గా రాత్రిపూట చిత్రీకరించబడిన ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విశేషం ఏమిటంటే.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ.. కేవలం సౌండ్ ఎఫెక్ట్స్తో ఉండటం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు, హీరో అయిన మున్నా కాశి మాట్లాడుతూ..…