శాసనసభ చిత్రంతో కథానాయకుడి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రసేన. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆ చిత్రం తన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిందని, శాసనసభ తరువాత మంచి ఆఫర్లు వరిస్తున్నాయని చెబుతున్న ఇంద్రసేన నటించిన తాజా చిత్రం ‘బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్’. ప్రముఖ దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్.రమేష్ కుమార్ నిర్మించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రసేనతో జరిపిన ఇంటర్వూ ఇది… శాసనసభ తరువాత ఇంత గ్యాప్ తీసుకున్నారెందుకని? శాసన సభ చిత్రం నటుడిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రం తరువాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ బాధ్యతగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.శాసనసభ సినిమా కంటే ముందే ఓకే చేసిన సినిమా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్. ఈ చిత్రం కూడా…