కీలక అంశాలపై ఐజేయూ కార్యవర్గం సుదీర్ఘ చర్చ : మథురలో ముగిసిన సమావేశాలు

కీలక అంశాలపై ఐజేయూ కార్యవర్గం సుదీర్ఘ చర్చ : మథురలో ముగిసిన సమావేశాలు

దేశంలో మీడియా సంస్థల, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మథుర నగరంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐజేయూ కార్యవర్గం, వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల ప్రధాన బాధ్యులు, పాల్గొన్న ఈ సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది. మే 10 న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరుగుతున్న రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు…