ఆలేరు, జనవరి 29 : యువతరం క్రీడాస్ఫూర్తితో మెలిగినప్పుడే ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంటాయని, ప్రతీ ఒక్క క్రీడాకారుడు ఆటల్లో మెరుగైన ప్రతిభను కనబరిచి ఇతర క్రీడాకారులకు మార్గదర్శిగా నిలవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా జరిగిన ముగింపు క్రీడలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. క్రీడల్లో పాల్గొన్న యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమని, యువకులంతా…