హీరో గోపీచంద్.. దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రమంలో… ఇప్పుడీ ఇద్దరూ కలిసి విజయమే లక్ష్యంగా ‘విశ్వం’తో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథేంటంటే.. జలాలుద్దీన్ ఖురేషి (జిషు సేన్) కరుడుగట్టిన ఐఎస్ఐ టెర్రరిస్ట్. సంజయ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ.. విద్యా వ్యవస్థ ముసుగులో విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. వాళ్ల సాయంతో పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తుంటాడు. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్) సోదరుడైన బాచిరాజు (సునీల్) సాయం తీసుకుంటాడు. కానీ, తన ఉగ్రచర్యల సంగతి సీతారామరాజుకు తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని జలాలుద్దీన్ కిరాతకంగా చంపేస్తాడు. ఈ హత్యను దర్శన అనే ఓ చిన్న పాప…
Category: రివ్యూస్
Movie Review: Srinuvaitla who does not come out of routine stories.. a novelty not seen in ‘Viswam’
Both actor Gopichand and director Srinu Vaitla have been struggling with successive defeats for years… Now both of them are aiming for victory together with ‘Viswam’ and they are standing in the ring of Vijayadashami. This is the first movie of their combo. Good expectations have already been formed on this. The story is.. Jalaluddin Qureshi (Jishu Sen) is a hardened ISI terrorist. Living in India under the alias of Sanjay Sharma, he is preparing students as terrorists under the guise of the education system. With their help, he creates…
‘Vettayan’ Movie Review in Telugu : వేట్టయన్ మూవీ రివ్యూ : ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్!
By ఎం.డి.అబ్దుల్/టాలీవుడ్ టైమ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా ‘వేట్టయన్: ద హంటర్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ‘జైలర్’ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించే రేంజ్ లో ఊచకోత కోసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రమిది. జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం ‘వేట్టయన్’. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి…
రాజేంద్రప్రసాద్కు ప్రభాస్ పరామర్శ!
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి గత శనివారం మృతి చెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేందప్రసాద్ను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెంకటేశ్ తదితరులు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే కూతురు పోయిన బాధలో ఉన్న నటకిరిటిని తాజాగా నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించాడు. ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం రాజేందప్రసాద్ కూతురు గాయత్రికి నివాళులు అర్పించాడు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో…
ఎన్టీఆర్తో జర్నీ నాకెప్పుడూ స్పెషలే.. ‘దేవర’ అందరికీ కన్నుల పండుగలా ఉంటుంది : దర్శకుడు కొరటాల శివ
ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ .. * ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఉండే ఎగ్జయిట్మెంటో, నెర్వస్నెస్ ఏదైనా అనుకోవచ్చు.. మనసులో అలా ఉంది. ప్రతి…
మన్యం ధీరుడు… మెప్పించే ఓ విప్లవ వీరుడి కథ
బ్రిటీష్ వారి బాని సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా… వెండితెరపై చూసినా…. కొత్తగానే వుంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి.మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ఆడియన్స్ ను ఏమాత్ర ఆకట్టుకున్నారో చూద్దాం పదండి. కథ: మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన…
ఉరుకు పటేల మూవీ రివ్యూ : మనసు దోచే కామెడీ థ్రిల్లర్!
లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి దర్శకత్వంలో తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. ఉరుకు పటేల సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ…
SPEED220 మూవీ రివ్యూ : అలరించే ప్రేమకథ!
యువతరాన్ని ఎంగేజ్ చేసే సినిమాలకి టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉంది. అందుకే నవతరం దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలు ఆశాజనకంగా గట్టేక్కే పరిస్థితి ఉంటుంది. అందుకు తోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. ఈచిత్రాన్ని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల…
AAY Movie Review in Telugu : ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు మిత్రుల నవ్వుల నజరానా!
ఎన్టీఆర్ బావమర్ది నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘ఆయ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు (ఆగస్టు 15)న ప్రీమియర్స్ వేశారు. కథ : కరోనా వచ్చిన కొత్తల్లో ఈ కథ జరుగుతుంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ తో గోదావరి జిల్లాల్లోని తన ఊరికి వస్తాడు.…