తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన వచ్చింది : సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి

Democratic rule has come in Telangana: Guntuka Venkateshwar Reddy wishes CM Revanth Reddy

హైదరాబాద్, డిసెంబర్ 10 : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటికి వెంటనే శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఆర్.ఐ గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి గతంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే, ఐఎన్ టీయూసీలో చురుకైన పాత్రని పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చిన రేవంత్‌ రెడ్డికి ఈ సందర్బంగా ఆయన శుభాకాంక్షలు అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం; ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న బీమా పరిమితిని…

నిరంతర విద్యుత్‌పై కాంగ్రెస్‌ విమర్శలు అర్థరహితం : బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్

Criticism of Congress on uninterrupted power is meaningless: BRS state leaders, former ZPTC of Aleru Botla Parameshwar

తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని వినియోగదారు లందరికీ నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బోట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.12,727 కోట్లు కేటాయించి, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,500 కోట్లకు పెంచింది. విద్యుత్‌ తలసరి వినియోగం 2014`15లో 1,356 యూనిట్లుగా ఉంది. 2021`22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,255 యూనిట్లుగా ఉంది. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు రూ. 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో 2014లో తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 1110…

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బిజెపి రాష్ట్ర నాయకులు జంపాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన నిధులవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరగనుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్లు విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌-భూపాలపట్నం సెక్షన్‌లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-167కేలో లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారని, ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల…

మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

నవతరానికి నాయకురాలిగా, యువతరానికి ఆదర్శప్రాయురాలిగా, భర్తకు తగ్గ భార్యగా రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఆపదలో వున్న వారికి నేనున్నానే భరోసా కల్పిస్తున్నారామె. జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏసీ గదుల్లో , కార్యాలయానికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల సమస్యలపై సునీత దృష్టి పెట్టారు. మారుమూల ప్రాంతాలలోని సామాన్యులతో కలియతిరుగుతూ, వారి కుటుంబంలో మనిషిలా వారికి తలలో నాలుకలా వుంటున్నారు. ఏం జరిగినా మా సునీతమ్మ వుందన్న భరోసాను ఆమె కల్పిస్తున్నారు. ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.

స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిన మహిళ ఇందిర : యం.ఏ. ఎజాజ్

Indhiragandhi jayanthi vedukalu in aler

ఆలేరులో ఘనంగా మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎంతో ప్రఖ్యాతిగాంచారని, ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. 1964 సంవత్సరములో తండ్రి జవహర్ లాల్ నెహ్రు మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైన ఇందిరాగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారన్న విషయాన్ని ఆయన…

‘అగ్నిపథ్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అలేరులో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

agnipath raddhu cheyalani alerlo sathyagraha dheeksha

టాలీవుడ్ టైమ్స్ # ఆలేరు ‘అగ్నిపథ్’ దేశాన్ని అగ్నిగుండం లా మార్చింది : ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు ఆలేరు పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య గారు.. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండల,టౌన్ పార్టీ ల అధ్యక్షులు,ఎంపీపీలు,సర్పంఫులు గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్…

YSR TELANGANA PARTY

YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president)

YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) visited to greet & congrats MOHD. IBRAHIM (shadnagar constituency incharge) congratulations for appointing as shadnagar constituency incharge With MOHD. TAHER KHAN (RJNR minority president) & Dr.sajid ali softskill trainer)& salma Begum RJNR DIV (mahila president

వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక

వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక

హైదరాబాద్: వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా సల్మాబేగం మాట్లాడుతూ నన్ను వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవికి తగిన న్యాయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సూచనలను పాటిస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు శ్రమించనున్నట్టు పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నందుకు వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లోని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్…

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ ‘రచ్చబండ’లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ 'రచ్చబండ'లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

ఉపాధి లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాల్లేక కూలీలుగా మారిన యువతను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడాలి. ఇలాంటి పాలకులను మనము గెలిపించినందుకు మన తప్పును మనమే సరిదిద్దుకోవాలి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రం వచ్చిన తర్వాత 8500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా అక్కున చేర్చుకో లేనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు పిసిసి అధ్యక్షులు రేవంతన్న అన్నట్టుగా…