రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తన తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మరియు బాలు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి ఆయన కతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఆయన…
Category: MOVIE REVIEWS
19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి : ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో నిర్మాత రాజ్ కందుకూరి
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. భూతనాల చెరువు నేపథ్యం ఏంటి? కాలేజ్లో దాగి వున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్ను కట్ చేశారు. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ భవనం నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలో జిన్…
బాబీ సింహా-హెబ్బా పటేల్ జంటగా యువ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం
బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి కృష్ణ దాస్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సదాశివుని మ్యూజిక్. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్. మూవీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత యువకృష్ణ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ మెహర్ నా స్నేహితుడు. సినిమా కోసం చాలా…
‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలివే.. ‘దండోరా’ కథ ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది? మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను…
కథాకేళి నుండి రెండవపాటగా ‘‘కొత్తగా ఓ రెండు తారలే..’’
ఈషా రెబ్బ, అనన్య నాగళ్ల, నందిని రాయ్, దినేశ్ తేజ్, అజయ్ కతుర్వార్, యశ్విన్ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కథాకేళి’. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్, యం.ఎస్ వారాహి క్రియేషన్స్ పతాకాలపై నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. అజయ్, అనన్య నాగళ్లపై చిత్రీకరించిన ‘‘కొత్తగా ఓ రెండు తారలే’’ అంటూ సాగే ఈ పాటను స్టార్ సింగర్ కోయిలమ్మ చిత్రగారు ఆలపించటంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చిత్రయూనిట్ సోమవారం ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రంలో భానుశ్రీ, ఆయుషి పటేల్, పూజా ఝవేరి, విరాట్, రవివర్మ గూడూరి, ప్రవీణ్, ప్రభు, జెమిని సురేశ్,…
సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘మిస్టీరియస్’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది : నిర్మాత జయ్ వల్లందాస్
రోహిత్ హీరోగా అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమా “మిస్టీరియస్”. రియా కపూర్ , మేఘనా రాజ్ పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ … – మా “మిస్టీరియస్” సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను యూఎస్ లో ఉంటాను. సినిమా రంగం మీద ఆసక్తితో టాలీవుడ్ కు వచ్చాను. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో “మిస్టీరియస్” చిత్రాన్ని నిర్మించాను. ఈ…
ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్కు ఫుల్ ఫన్ గ్యారంటీ!
థియేటర్లలో నవ్వులు పూయించడానికి ముందుగానే వస్తున్న ‘ఫంకీ’ వేసవిలో కాదు.. ప్రేమికుల దినోత్సవానికే వినోదాల విందు వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా థియేటర్లలో ‘ఫంకీ’ చిత్రం సందడి మొదలు కానుంది. అపరిమితమైన వినోదాన్ని అందించనున్న ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరగడంతో.. కాస్త ముందుగానే ప్రేక్షకులు…
రామ్ గణపతి హీరోగా నటిస్తున్న “కాలం” మూవీ ట్రైలర్ లాంఛ్
ఇఈ, రాజయోగం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు రామ్ గణపతి. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా “కాలం”. ఈ సినిమాను శ్రీ నవబాల క్రియేషన్స్, 3 కీజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. మిట్టపెల్లి రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ గణపతి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకట సురేష్. ఆర్. రూపొందిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన “కాలం” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో సాయి రోనక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిర్మాత మణి లక్ష్మణరావు మాట్లాడుతూ…
‘దేఖ్లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో సంచలనం సృష్టించిన ‘దేఖ్లేంగే సాలా’ ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్లేంగే సాలా’ విడుదలై శ్రోతలను ఉర్రుతలూగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి, తక్షణ హిట్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి, సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది.…
బ్లాక్బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ‘పతంగ్’ లో ఉన్నాయి: ట్రైలర్ ఆవిష్కరణలో దర్శకుడు దేవకట్టా
ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్’ పతంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. పాపులర్ దర్శకుడు నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.…
