నటి రష్మిక మందన్న ఇటీవల తన స్నేహితురాళ్లతో కలిసి శ్రీలంకకు వెళ్లిన ట్రిప్ ఆన్లైన్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పెళ్లికి ముందు ఇది బ్యాచిలరేట్ వేడుక అని అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. రష్మిక మందన్న ఇటీవల తన పని షెడ్యూల్ నుండి చిన్న విరామం తీసుకుని, తన సన్నిహిత స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లింది. ఈ రెండు రోజుల చిన్న ట్రిప్ ఆమె వృత్తిపరమైన పనుల నుండి రిఫ్రెషింగ్ బ్రేక్ ఇచ్చింది. ఇది ఆన్లైన్లో అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. ఈ ట్రిప్కు సంబంధించిన పలు చిత్రాలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బీచ్లో సేదతీరడం, అందమైన దృశ్యాలు, స్నేహితులతో సంతోషకరమైన క్షణాలను చూపించింది. తన క్యాప్షన్లో, రష్మిక సమయం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేసింది. గర్ల్స్ ట్రిప్స్ ఎంత సమయం ఉన్నా…
Category: MOVIE REVIEWS
19 నుండి 21వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
ఈనెల 19-21 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు నిర్వహణ కమిటీ ప్యాట్రన్ , అంకురం సినిమా దర్శకుడు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీ కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర రావు తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహాకారాలతో దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 19 నుండి 21వ తేదీ వరకు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ థియేటర్ లోని స్క్రీన్ నెంబర్. 4 మరియు 5లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ చలనచిత్ర అభివృద్ధి సంస్థ , సాంస్కృతిక, యువజన, పర్యాటక శాఖలు ఈ కార్యక్రమాన్ని…
జేమ్స్ కామెరాన్, ఎస్ఎస్ రాజమౌళి మధ్య సినిమా సంభాషణ – అవతార్: ఫైర్ అండ్ ఆష్ పై ఉత్సాహం
ప్రపంచ సినిమా దిగ్గజులు జేమ్స్ కామెరాన్, ఎస్ఎస్ రాజమౌళి కలిసి అవతార్ ఫ్రాంచైజీలో రాబోయే చిత్రం అవతార్: ఫైర్ అండ్ ఆష్ గురించి చర్చించారు. ఈ సంభాషణలో భారీ స్థాయి కథనాలు, సృజనాత్మక ప్రక్రియలు, చిత్ర విడుదల సమయంలో వచ్చే ఆందోళనల గురించి బహిరంగంగా మాట్లాడారు. అవతార్: ఫైర్ అండ్ ఆష్ చూసినప్పుడు రాజమౌళి “థియేటర్లో పిల్లవాడిలా చూస్తుండిపోయాను” అని వ్యాఖ్యానించారు. కామెరాన్ సినిమాటిక్ స్పెక్టాకిల్ను మరింత అభివృద్ధి చేస్తూనే భావోద్వేగాలను కేంద్రంగా ఉంచడాన్ని ప్రశంసించారు. హైదరాబాద్లో అవతార్ ఐమాక్స్లో ఏడాది పాటు ప్రదర్శించబడిందని రాజమౌళి పేర్కొన్నారు. అవతార్ ఫ్రాంచైజీ ఇమ్మర్సివ్ బిగ్ స్క్రీన్ అనుభవాలకు బెంచ్మార్క్గా ఉందని ఆయన అన్నారు. కామెరాన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్ను అభినందించి, భారతీయ దర్శకుడి ఫిల్మ్ సెట్ను సందర్శించాలని కోరిక వ్యక్తం చేశారు. 20th సెంచరీ స్టూడియోస్ నుంచి…
గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలకు రెండు కోట్లు విరాళం : అనౌన్స్ చేసిన అక్కినేని నాగార్జున
నటసామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఐదవ తరగతి వరకే చదువుకున్నారు. కానీ, ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడే వారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట గుడివాడలో ఒక కళాశాల వుంది. దానికొక ఘనమైన చరిత్ర వుంది. 1959లో ఆ కళాశాల నిర్మాణానికి అక్కినేని నాగేశ్వరరావు లక్ష రూపాయలు ఇచ్చారు. అప్పట్లో లక్ష అంటే ఇప్పుడు ఎన్నో కోట్లు. గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో చదివిన వాళ్ళు అనేకమంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు! చాలామంది అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు! ఆ తరువాత ఆ కళాశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు. అది వేరే విషయం కానీ, 66 ఏళ్ల క్రితం అక్కినేని ఇచ్చిన ఆ లక్ష వల్ల ఇన్నేళ్లు అయినా ఆ కళాశాలకు గొప్ప గుర్తింపు. ఎందరో ఉన్నత విద్య చదువుకోగలిగారు, చదువుకున్నారు, చదువుకుంటున్నారు. సరే.. నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా…
ఆస్కార్ రేసులో భారతీయ చిత్రం ‘హోమ్బౌండ్’
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్బౌండ్’ చిత్రం ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే చిత్ర నిర్మాత కరణ్ జొహార్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. “హోమ్బౌండ్ ప్రయాణం పట్ల నేను ఎంత గర్వంగా, సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మా ఫిల్మోగ్రఫీలో ఇంతటి ముఖ్యమైన సినిమా ఉండటం ఒక గౌరవం” అంటూ ఆయన భావోద్వేగభరితమైన నోట్ రాశారు. కేన్స్ నుంచి ఆస్కార్ షార్ట్లిస్ట్ వరకు ఈ ప్రయాణం అద్భుతమని, తమ కలలను నిజం చేసిన దర్శకుడు నీరజ్ ఘైవాన్కు…
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్
సౌతిండియా హాట్ ఫెవరెట్ హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్ పవర్ఫుల్ రోల్.. హీరోయిజంను ఫర్ఫెక్ట్ గా ప్లే చేసే హీరో నవీన్ చంద్ర పవర్ ఫుల్ రోల్ లో.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు.. హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకేక్కిస్తున్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ పవర్ఫుల్ యాటిట్యూడ్తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారని నిర్మాత తెలిపారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు.…
‘Dhandoraa Is a Powerfully Crafted Film Blending Every Commercial Element with Depth,’ Says Actor Shivaji
Veteran actor Shivaji, known for choosing unconventional and layered roles, plays a pivotal part in the upcoming film Dhandoraa. Produced by Ravindra Banerjee Muppaneni under the Loukya Entertainments banner, the production house behind acclaimed films like Colour Photo and Bedurulanka 2012, Dhandoraa is directed by MuraliKanth and is scheduled for a grand theatrical release on December 25. Alongside Shivaji, the film features an ensemble cast including Navdeep, Nandu, Ravi Krishna, Manika Chikkala, Mounika Reddy, Bindu Madhavi, Radhya, and Aditi Bhavaraju in key roles. As part of the film’s promotional activities,…
‘దండోరా’ అన్ని రకాల కమర్షియల్ అంశాలతో జోడించి తీసిన అద్భుతమైన చిత్రం : నటుడు శివాజీ
విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ‘దండోరా’ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా నటుడు శివాజీ మీడియాతో ముచ్చటించారు. చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే.. ‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’ కథ విన్నారా? ముందుగా ‘దండోరా’ కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.…
‘అఖండ 2 తాండవం’విజయం ఆనందాన్ని ఇచ్చింది : బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ అఖండ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? -ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు. ఈ సినిమా ప్రజలకు చేరాలని తీశాం. మన తత్వం…
‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరిలో రిలీజ్
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రతి సినిమాతో ప్రేక్షలకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ రోజు సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్ను అనౌన్స్ చేశారు. స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్ను రివిల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని కూడా ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. అర్బన్ సెటప్లో సాగే ఈ గ్లింప్స్లో, కస్టమ్ యెల్లో మోటార్సైకిల్పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న…
