* సెట్స్ పై ఏకంగా నాలుగు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది ఆగస్టు 22తో 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. గత రెండేళ్ళుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ రానుంది. ఇక రెండేళ్ళ నుంచీ రూపొందుతోన్న ‘విశ్వంభర’ను కూడా వచ్చే యేడాది విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. ‘భోళాశంకర్’ తరువాత ‘విశ్వంభర’లో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ యేడాది సంక్రాంతికే విడుదల కావలసింది. అయితే కథానుగుణంగా ‘విశ్వంభర’లో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకొని దానిని చక్కగా…
Category: MOVIE REVIEWS
ఆ మాటలు నన్ను వెంటాడాయి… 36 గంటలు నిద్ర పట్టలేదు
దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన శివాజీ దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంతో క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజ్పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో .. నటుడు శివాజీ మాట్లాడుతూ ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా పదాలను ఎప్పుడూ దొర్లలేదు. నేను ఇక్కడకు వచ్చి 30…
‘డైమండ్ డెకాయిట్’ టీజర్ రిలీజ్
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి అని ముగించారు. హీరోయిన్ మేఘన మాట్లాడుతూ ఇ సినిమా ని…
‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ విడుదలైంది. ‘ఫంకీ’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ‘ధీరే ధీరే’కి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం. వినసొంపుగా ఉన్న ఈ ‘ధీరే ధీరే’ మెలోడి, వినగానే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయేలా ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జోడి…
సమంత లాంచ్ చేసిన ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’
ఛాంపియన్ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్బస్టర్లుగా నిలిచాయి. గిర గిర సాంగ్ అన్ని ప్లాట్ఫామ్లలో ట్రెండ్ అవుతూనే ఉండగా, మనసుని కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుడాలే కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం నుంచి మూడవ పాటను ఇప్పుడు మేకర్స్ లాంచ్ చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మూడో సింగిల్ ఐ యామ్ ఎ ఛాంపియన్ సాంగ్ ఒక ప్రత్యేకమైన, పూర్తి స్థాయి డాన్స్ నంబర్గా అలరించింది. గ్రాండియర్తో పాటు రిథ్మిక్ ఎలిగెన్స్ను కలిపిన ఈ పాట, భారీ సెట్పై, అద్భుతమైన డాన్స్లతో కన్నుల పండువైన విజువల్ స్పెక్టాకిల్గా…
‘ఛాంపియన్’ తో హిట్ కొడుతున్నాం : హీరో రోషన్
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు. ఛాంపియన్ నైట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే మాకు ఎంతగానో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ప్రదీప్ గారు ఈ ప్రాజెక్టు…
యానిమేటెడ్ అడ్వెంచర్ ‘మిషన్ సాంటా’
ఇటీవల యానిమేషన్ చిత్రంగా రూపొంది భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన ‘నరసింహా అవతార్’ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో యానిమేషన్ ఫీచర్ ఫిలిం రిలీజ్ కాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ భారీ యానిమేటెడ్ ఫిలిం ‘మిషన్ సాంటా’. ఈ అత్యుత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిలిం ఈ నెల 25న కిస్మస్ కానుకగా భారత్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 25న అంటే అదే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లోని పలు థియేటర్లో ‘మిషన్ సాంటా’ రిలీజ్ కాబోతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథతో రూపొందిన హై ఎనర్జీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిత్రం ఇది. యానిమేషన్ క్వాలిటీ, సినిమాలో ఉండే…
త్రీ రోజెస్’ సీజన్ 2 : నవతరం తెలుగు అమ్మాయిల జర్నీ!
ఈషా రెబ్బా, సత్య, రాశీ సింగ్, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ గర్ల్స్ గ్యాంగ్ హంగామా చూపిస్తూ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన “4 మోర్ షాట్స్ ప్లీజ్” లాంటి సక్సెస్ అందుకుంటోంది. సంప్రదాయాలను మించిన స్వేచ్ఛను, ఎవరి విమర్శలను పట్టించుకోని స్నేహం, తమదైన ఆశయంతో ముందుకు సాగే ముగ్గురు అమ్మాయిలుగా ఈషా, రాశీ, కుషిత తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండీ లైఫ్ లో లవ్, కెరీర్, పర్సనల్ స్పేస్ ను కోరుకునే నవతరం తెలుగు అమ్మాయిల జర్నీని ఈ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా చూపిస్తోంది. నగరంలో నేటి…
‘పతంగ్’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్
ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్’ పతంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. పాపులర్ దర్శకుడు నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.…
హైటెక్స్లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో, మేధాశక్తి వికాసంలో చెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ క్రీడలో ఎదగాలంటే కష్టపడి సాధన చేయాల్సిందేనని, నిరంతర శ్రమే విజయానికి మార్గమని సూచించారు. హైదరాబాద్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు ఆటలో సహజమని, గెలిచినా ఓడినా మళ్లీ మళ్లీ ఆడుతూ ముందుకు సాగితే ఒక రోజు తప్పకుండా విజయం వరిస్తుందన్నారు. పిల్లలలో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఏకాగ్ర అకాడమీలో శిక్షణ…
