టాలీవుడ్లో ఈ జనరేషన్లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్కు మాత్రమే సొంతం. కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. లాఠీ సినిమాతో కెరియర్ ప్రారంభించి మొత్తానికి 30 ఏళ్ల పైబడిన కెరీర్లో మొత్తంగా 14 చిత్రాలు తెరకెక్కించాడు. అందులో పౌరాణిక, చారిత్రక, సోషల్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ జనరేషన్లో ఇన్ని జానర్స్లో సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు లేరు. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్కు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. గుణశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు .. ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్…
Category: Entertainment
ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి గొప్ప దర్శకుల వల్లే బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి : ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – బయట భరించరానంత ఎండలు ఉన్నాయి కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ లో మాత్రం కాశ్మీర్ మంచు కొండల్లో కూర్చున్నట్లు ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు గారు, ఎండీ రామ్మోహన్ రావు గారు, నా స్నేహితులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి..ఇలాంటి మంచి వాళ్ల వల్ల ఇండస్ట్రీ ఎంత బాగుంది. ఇండస్ట్రీలోని వాళ్లంతా వచ్చి ఇలా హోమ్లీగా ఒక కార్యక్రమం చేసుకుని ఎంతో కాలమైంది. దాదాపు 40 ఏళ్లుగా ఇలాంటి మహానుభావులు ఉండబట్టే బ్రహ్మాండమైన చిత్రాలు తెలుగులో వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ…
ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు
గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) 28 కోట్ల ఆర్థిక మోసాలు -విశాఖపట్నం ప్రెస్ మీట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపణ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబీకులు నటించిన సినిమాలకు రిలీజ్ సమయంలో ఏదోరకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీష్ లు ప్రయత్నిస్తున్నారని, ‘మన శంకర వరప్రసాద్’ రిలీజ్ సమయంలో కూడా విశాఖపట్నం ఏరియాలో ఆ సినిమాను ఆపాలని వారు కుట్రలు పన్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ, విశాఖపట్నంకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్)ను అడ్డం పెట్టుకుని, దిల్ రాజు, శిరీష్ లు ఆ…
హీరోల కోసం కథ రాయడం మానేయాలి : సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ ఇంటర్వ్యూ..
* ‘యుఫోరియా’ కొత్త ఎనర్జీని ఇచ్చింది.. సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తన విభిన్న కథనాలు, మేకింగ్, టేకింగ్తో తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఇచ్చిన గుణ శేఖర్ రీసెంట్గా ‘యుఫోరియా’ అంటూ న్యూ ఏజ్ సినిమాని తెరకెక్కించారు. ‘యుఫోరియా’ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 2న ఆయన తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుణ శేఖర్ మీడియాతో తన సినీ జర్నీకి సంబంధించిన విశేషాలెన్నో పంచుకున్నారు. ‘యుఫోరియా’పై వచ్చిన స్పందన మీకు ఎలా అనిపించింది? -నేను నా కెరీర్లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘యుఫోరియా’ ఇంకో ఎత్తు. ఇలాంటి గొప్ప సినిమాలు మళ్లీ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చూశాను. ఎంతో మంది అనలిటికల్గా రివ్యూలు చేస్తే..…
M4M (Motive For Murder) Set for OTT Release from June 19, 2026 directed by Mohan Vadlapatla, starring Jo Sharma USA.
The suspense thriller M4M (Motive For Murder), which was released worldwide in theaters on May 8 directed/produced by Mohan Vadlapatla starring American Actress Jo Sharma and Sambeet Acharya, received an excellent response from audiences, media and critics alike. The film earned impressive ratings, including 9.1/10 on IMDb and 9.6/10 on BookMyShow, along with positive reviews from several leading newspapers, news channels and entertainment websites, with ratings ranging from 3.5 out of 5. Audience from both India and USA, celebrated the movie success marking it as one of best suspense thrillers…
జూన్ 19 నుండి ఓటీటీలోకి వస్తున్న M4M (Motive For Murder)
దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి Jo Sharma హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు మరియు సినీ విమర్శకుల నుంచి విశేష ఆదరణను పొందింది. Jo Sharma, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎండీబీలో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్ను సాధించింది. అలాగే పలు ప్రముఖ దినపత్రికలు, టెలివిజన్ ఛానెల్లు మరియు వినోద వెబ్సైట్లు ఈ చిత్రానికి 5లో 3.5 వరకు రేటింగ్స్ ఇస్తూ ప్రశంసించాయి. భారత్తో పాటు అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా అభివర్ణించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన…
balakrishna: క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా…
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతో దూసుకుపోతున్నారు. తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్.బి.కె 111’ షూటింగ్లో ఆయన ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. దీనితో పాటుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్.బి.కె 112’ ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య జాబితాలోకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త వార్త హాట్…
మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్బండ్లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం నాయకులైన ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్,…
‘సింగ్ గీతం’ నుంచి ‘ఏమైంది’ సాంగ్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులని అలరించారు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ మరోసారి అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు. ‘ఏమైంది’ పాట ఓ మ్యూజికల్ పజిల్లా సాగుతుంది. ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సి…
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
▪️ కృష్ణ సినిమాలను గుర్తు చేస్తూ సాగే ప్రత్యేక పాట ▪️ 52 మంది ఆర్టిస్టులతో 45 రోజుల్లో సినిమా పూర్తి ▪️ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరెక్కించిన మూవీ ▪️ జూన్ 12న థియేటర్లో విడుదల కానున్న చిత్రం టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్తో పాటు రెండు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్…
