టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘శ్రీమంతుడు’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2015 ఆగస్ట్ 7న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 140 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాతోనే గ్రామాలను దత్తత తీసుకోవడం పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ‘శ్రీమంతుడు’ యూట్యూబ్లో 200 మిలియన్స్ (20కోట్ల) వ్యూస్ దాటినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే యూట్యూబ్లో 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా ‘శ్రీమంతుడు’ రికార్డు కొట్టింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్…
Category: Entertainment
‘జవాన్’ కలెక్షన్ల వేట!
షారుఖ్ ఖాన్ , తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వచ్చిన ‘జవాన్’ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విడుదలైంది. ఒక్క హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ భారీగా విడుదల చేశారు ఈ సినిమాని. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి , దీపికా పడుకోనే , ప్రియమణి ఇలా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమాకి చాలా హైప్ కూడా వచ్చింది. అలాగే ఈ సినిమా ఒక పైసా వసూల్ సినిమాని, మాస్ ఎంటర్ టైనర్ అని ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా రికార్డు స్థాయిలో వుంటాయని ట్రేడ్ విశ్లేషకులు ఊహించారు. అందరి ఊహలకు అనుకున్నట్టుగానే ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సృష్టించి ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు విడుదలైన సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ , షారుఖ్…
ప్రభాస్ ‘సలార్’ విడుదలకి జాప్యం ఎందుకంటే…?
దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ప్రభాస్ చిత్రం ‘సలార్’ సినిమా ఈనెలలో విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీ ఎపుడు అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా, ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ అవకపోవటమే విడుదలకి జాప్యం అని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ చాలా ఉందని, అది చేసి ఇవ్వటంలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. మామూలుగా సినిమా గ్రాఫిక్ వర్క్ విడుదల తేదీకి ముందుగా అంటే ఒక నెల రోజులు ముందుగా ఆ పనులు పూర్తయిపోవాలి. ఎందుకంటే అందులో మళ్ళీ కరెక్షన్స్…
గీతా ఆర్ట్స్ నుంచి కోటబొమ్మాళి పిఎస్!
‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతి రోజు పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయాట్టు’ అనే సినిమాని తెలుగులో ‘కోట బొమ్మాళి పిఎస్’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఈ తెలుగు రీమేక్ లో సీనియర్ నటుడు శ్రీకాంత్, మేక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, వరలక్ష్మి శరత్కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అలాగే రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ లు కూడా రెండు కీలక పాత్రల్లో కనపడనున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ఆమధ్య విడుదల చేశారు, అది కొంచెం ఆసక్తిని పెంచింది.…
పెదకాపు: శ్రీకాంత్ అడ్డాల సాహసానికి మెచ్చు కోవాల్సిందే..!
సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’తో మాస్ సినిమాలు డీల్ చేయడంలో కూడా దిట్ట అని నిరూపించుకున్నాడు. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. ఒరిజినల్ సోల్ మిస్సవ్వకుండా శ్రీకాంత్ తన టేకింగ్తో కథను నడిపిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని హీరోగా పెట్టి ‘పెద కాపు’ అనే ఓ అవుట్ అండ్ అవుట్ రా, రస్టిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ నుంచి మొన్న రిలీజైన గ్లింప్స్ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఓ సామాన్యుడు సంతకం అంటూ మేకర్స్ సినిమాను ప్రమోట్ చేస్తూ జనాల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ‘పెదకాపు’ సినిమాను ఈ నెలాఖరులో 28న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రమోషన్ల…
ఆనంద్ దేవరకొండ చిత్రం ‘గం..గం..గణేశా’
‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘మిడిల్క్లాస్ మెలోడీస్’, ‘పుష్పకవిమానం’ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఈ ఏడాది ‘బేబి’ సినిమాతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తోన్న కొత్త చిత్రం ‘గం..గం..గణేశా’ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్ను డిజిటల్గా సమంత లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్కు సంబంధించి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. కొంపల్లిలోని రాయచందాని మాల్ లో ఈ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ను నిర్వహించనున్న ట్లు మేకర్స్ సోషల్ మీడియాలో…
గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో.. క్లాప్ కొట్టిన దర్శకేంద్రుడు
మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్టు చూసి చాలా ఏళ్లయింది. దాదాపుగా తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రామబాణం’ అల్టా డిజాస్టర్గా నిలిచింది. తన కెరీర్లో రెండు బిగ్గెస్ట్ హిట్లిచ్చిన శ్రీవాస్ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని గోపీచంద్ తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా మెగాఫోన్ పట్టని శ్రీనువైట్లతో. ఒకప్పుడు సూపర్ ఫామ్లో ఉన్న వైట్ల ఇప్పుడు హిట్టు సినిమా తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన రవితేజకు ‘అమర్ అక్బర్ ఆంటోని’ రూపంలో డిజాస్టర్ సినిమా ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పటివరకు శ్రీనువైట్ల మరో సినిమా చేయలేదు. అయితే చాలా మంది ఈ దర్శకుడి సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడంటే టైమ్ బాలేక సరైన సినిమాలు…
‘ఆదికేశవ’ నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ పాట విడుదల!
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’ శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో అపర్ణా దాస్, జోజు జార్జ్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే పాటను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ సాంగ్ ఇది. హీరో హీరోయిన్ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే పాట ఇది. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్,…
‘హరిహరవీరమల్లు’లో కీలక ఘట్టాలు.. యుద్ద విద్యల్లో శిక్షణ పొందిన పవన్!
పవన్కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్ యుద్థ విద్యల కోసం ‘షావోలిన్ వారియర్ మంక్ అకాడమీ’లో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ హర్ష్ వర్మ కూడా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ .. ‘పవన్కల్యాణ్ వల్లే నాకు నటనపై ఆసక్తి కలిగింది.ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. సెట్లో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాను. చిన్న విషయాన్ని కూడా నిశితంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పవన్ ది. క్షణాల్లో సీన్…
విశాల్ ‘మార్క్ ఆంటోని’ వీరభద్ర స్వామి లిరికల్ వీడియో సాంగ్ విడుదల
గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్ విలక్షణమైన సినిమాలు, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్ ప్రేక్షకులతో పురచ్చి తలపతి అనిపించుకుంటూ టాలీవుడ్ లో కూడా సుపరిచితమై తనదైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు విశాల్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తుండగా విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ ఈ…
