వివివి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రుతి ఢాంగే ప్రధాన పాత్రలో, ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం”. చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి…పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైన సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ…. వీరఖడ్గం… ఎంతో మంది ప్రావీణ్యం కలిగిన టెక్నీషియన్స్, ఆధునిక సాంకేతికతో ఈ చిత్రాన్ని రూపొందించారు, తమిళ్ పొన్ను శృతి ఢాంగే, తన అందాలతో అలరించింది, సీనియర్ విలక్షణ నటులు సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, తమదైన నటనా శైలి తో మెప్పించారు, నవ్వులు కూడా ఈర్ష్య పడేలా హాస్యామృతాన్ని పంచే హాస్యాబ్రహ్మ బ్రహ్మానందం,…
Category: Entertainment
నందమూరి తారకరత్న కన్నుమూత
గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. నారాయణ హృదయాలయకు విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో హార్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి చికిత్స కొనసాగింది. తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో విషాదం అలుముకుంది. తారకరత్న మరణ వార్త తెలిసి నందమూరి ఫ్యామిలీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. నందమూరి…
‘మా ఊరి పొలిమేర’ సీక్వెల్ షూటింగ్ పూర్తి!!
శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా `మా ఊరి పొలిమేర` చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, సినిమాటోగ్రఫీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి, పీఆర్వో: వంగాల కుమారస్వామి, ఆర్ట్ డైరక్టర్: ఉపేంద్ర రెడ్డి చందా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.సి.సతీష్ కుమార్, నిర్మాత: గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్: డా.అనిల్…
‘Maa Oori Polimera’ sequel wraps up its shoot; post-production works at a brisk pace
Shree Krishna Creations is producing a sequel to ‘Maa Oori Polimera’, the 2021 release. Gowr Kriesna is producing the sequel on a big scale. Dr. Anil Vishwanath is its director. Satyam Rajesh, Dr. Kamakshi Bhaskarla, Get-up Srinu, Baladitya, Ravi Varma, Chitram Sreenu, and Akshata Srinivas are playing different roles. The film was shot in Uttarakhand, Kerala, Andhra Pradesh, Khammam and Hyderabad. The shooting has been successfully completed. Currently, the post-production works have been done at a swift pace. Very soon, full details of the film will be revealed. Music Director:…
మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా ‘సార్’ : దర్శకుడు వెంకీ అట్లూరి
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. షో షోకి వసూళ్ళు పెంచుకుంటూ ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా.. సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది 1990-2000 నాటి కథ కదా.. ఇప్పటి యువతకి నచ్చుతుందా అనే సందేహం…
‘మాధవే మధుసూదనా’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేసిన కింగ్ అక్కినేని నాగార్జున
బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు పెంచేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను మేకర్లు రిలీజ్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేయించారు మేకర్లు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బాగుందని,…
King Akkineni Nagarjuna Releases ‘Madhave Madhusudana’ First Look Motion Poster
It is well-known that production number two, which Bomma Devara Ramachandra Rao directed and produced alongside Teja Bomma Devara and Rishika Lokre for Sai Ratna Creations under Bomma Devara Sridevi, debuted to much excitement in Hyderabad’s Annapurna Studios. But suddenly, this movie is receiving more advertising. The creators of this movie have unveiled the motion poster for the first peek. This first image at King Akkineni Nagarjuna holding the motion poster has been made public by the film’s creators. Subsequently, Nagarjuna claimed that everyone had enjoyed and approved of the…
Emotional journey, Joju in acting excellence; ‘Iratta’ Releases Outside Kerala Today
‘Iratta’ is a film directed by debutant Rohit MG Krishnan with Joju George as the lead. The film, which tells the story of twin brothers Vinod and Pramod, is a thriller that hides a lot of suspense. The film released theatrically on February 3. The film has the distinction of being Joju George’s first double role. The film is releasing outside Kerala from February 17, with suspenseful scenes and an unexpected climax. What makes ‘Iratta’ different from other films is that the film is not the police story or the…
మహా శివరాత్రి సందర్బంగా అమెజాన్ ప్రైమ్, ఆహాలలో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా థియేటర్స్లో సందడి చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడీ సినిమా ఆడియెన్స్కు మరింత చేరువ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఆహాల్లో మహా శివ రాత్రి సందర్భంగా స్ట్రీమింగ్ అవుతుంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు లక్ష్మణ్ (సయ్యద్ సోహైల్). తండ్రి (దేవీ ప్రసాద్) ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు. తను ఏది అడిగినా కొనివ్వలేడు. దీంతో లక్ష్మణ్లో తెలియని అసంతృప్తి ఉంటుంది. ఇంజనీరింగ్ చదివే సమయంలో శ్రియ (మోక్ష)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి లక్ష్మణ్…
