Felicitates Paris 2024 Paralympic silver medallist Yogesh Kathuniya at a glittering event in Delhi Shrewsbury International School India, an iconic co-educational boarding British school, organised a grand event in New Delhi, to discuss and share about Holistic education in India and also to announce the commencement of its first academic session in August 2025. An inspiring fireside chat with Paris 2024 Paralympic silver medallist Yogesh Kathuniya was the central piece of this event which brought to the fore how the whole-person model of education is the cornerstone of British education…
Category: ఇతరములు
ప్రపంచ దేశాల మధ్య స్నేహ బంధం పెనవేస్తున్న కలశ నాయుడు
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు. ఇరుగు పొరుగుతో ఎన్ని ఘర్షణలున్నాఇంటి సరిహద్దులు మార్చుకోలేము. అందుకే సరిహద్దు వివాదాలను ప్రేమ, స్నేహానుబంధాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడం సాధ్యమని ఇండియా పాకిస్థాన్ సరిహద్దు వివాదాలపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ చేసిన వ్యాఖ్యలు నేటికీ ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయమే. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయ్ ఆశయాలను, సూచనలను అక్షరాలా అమలు చేస్తోంది చిన్నారి కలశనాయుడు. సామాజిక సేవతో ప్రపంచ దేశాల మధ్య స్నేహ సౌరభాలను పూయిస్తున్న పదకొండేళ్ల ఆ చిన్నారి డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ 2024 అవార్డును సొంతం చేసుకుంది. వివాదాల పరిష్కారం కోసం ప్రారంభించే యుద్ధం రక్త పాతం…
జేఎన్జే స్థలంపై కుట్ర తగదు
హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచివల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఇటీవల రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అప్పగించడంపై కొందరు కుట్రదారులు కడుపుమంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని సొసైటీ డైరెక్టర్లు బి.కిరణ్ కుమార్, ఆర్.రవికాంత్రెడ్డి, ఎన్.వంశీ శ్రీనివాస్, పీవీ రమణారావు, కె.అశోక్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థలాల కేటాయింపును అడ్డుకుంటామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పట్లో స్థలం కొనుగోలుకు సభ్యులు అందిన కాడల్లా అప్పు చేశారని, ఇంకొందరు అప్పు పుట్టక భార్యల మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. కుట్రదారులు వాస్తవాలను దురుద్దేశపూరితంగా విస్మరించి సొసైటీపై విషం చిమ్ముతున్నారని, ఆంధ్ర, తెలంగాణ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రాజకీయ ప్రేరేపిత స్వయం ప్రకటిత సోషల్ మీడియా జర్నలిస్టులు చేస్తున్న దుష్ర్పచారాన్ని బుద్ధిజీవులు,…
తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగానే ఫైనల్ స్టేజ్ కు చేరింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఎంటర్ టైనింగ్ జర్నీ గ్రేట్ జర్నీకి చేరుకుంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల కేవలం రెండు వారాలు మిగిలి ఉన్నాయి. 15,000 మంది ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన ఈ పాటల పోటీ ఇప్పుడు మొదటి ఆరు ఫైనలిస్ట్లకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్లు 5,000 మంది పాల్గొనేవారి నుండి విశేషమైన ప్రతిభను ప్రదర్శించాయి. ఈ ఆకట్టుకునే పూల్ నుండి, భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం…
10న చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్యరూపకం
తెలంగాణ ఉద్యమ వీర వనిత చాకలి ఐలమ్మ జీవితం తొలిసారి కూచిపూడి నృత్య రూపకంలో వేదిక పైకి రానున్నది! తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు, కళాతపస్వి, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డా. అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించనున్నారు. ఆధునిక సామాజిక పరిణామానికి, భూపోరాటానికి నాంది పలికిన మహిళ చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఐలమ్మ పాత్రను తానే పోషిస్తున్నట్లు డా. అలేఖ్య పుంజాల తెలిపారు. ఇవాళ అకాల మృతి చెందిన సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఈ నృత్య రూపకాన్ని రచించగా వి. బి.ఎస్.మురళి బృందం సంగీతం అందించారు. తన ఆలోచన అని, తానే…
కనుల పండువగా బి.ఎస్. రాములు అమృతోత్సవం
25 ఏళ్ల తెలంగాణ సాహిత్యంపై విశేష చర్చ 25 కొత్త పుస్తకాలు ఆవిష్కరణ హైదరాబాద్ : సామాజిక న్యాయమే రచయిత బి. ఎస్. రాములు లక్ష్యం అని, తన రచనలతో ఉపన్యాసాలతో జీవన నైపుణ్య కార్యశాలలు నిర్వహించిన తాత్వికవేత్త అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ముఖ్య కార్యదర్శి, కవి డా. ఎ. విద్యాసాగర్ అభినందించారు. జన చైతన్య మార్గాన్వేషకుడు బి. ఎస్. రాములు గొప్ప సృజనశీలి అని కవితాత్మకంగా ఆయన కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో విశాల సాహిత్య అకాడమీ, సామాజిక తాత్విక విశ్వ విద్యాలయం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత, తెలంగాణ బిసి కమిషన్ తొలి చైర్మన్ బి. ఎస్. రాములు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమృతోత్సవ వేడుకల సందర్భంగా పాతికేళ్ల తెలంగాణ సాహిత్యంపై సదస్సు…
ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత రావు, సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఎ. రాజేష్, కార్యవర్గ సభ్యులు వసంత్, బాపు రావు, ఎం. రమాదేవి, టి. శ్రీనివాస్ తో పాటు ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు హాజరయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని అధ్యక్షులు వేణుగోపాల నాయుడు సూచించారు. ఆనాటి పోరాట యోధుల త్యాగ ఫలితంతో మనం స్వేఛ్చను అనుభవిస్తున్నామని అన్నారు. నేటి తరానికి వారి త్యాగాలను వివరించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో అందరూ భాగస్వామ్యులు కావాలని వేణుగోపాల నాయుడు కోరారు.
ఘనంగా ఆర్ ఎల్ టూర్స్ & ట్రావెల్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు సందడి చేసిన సినీ ప్రముఖులు…
హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటిగా హైదరాబాద్కు చెందిన ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకుసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్లో ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఎయిర్ టికెటింగ్, గ్రూప్ ప్యాకేజీలు, వీసాలు, ఫారెక్స్, ప్రయాణ బీమా తదితర అన్ని సేవలను ఒకే గొడుగు కింద ఈ సంస్థ అందిస్తుంది. మాక్సివిజన్, క్లౌడ్టారో, గ్నాపికా ఎంటర్టైన్మెంట్, ఎస్. జి మూవీ మేకర్స్ తదితర ప్రతిష్టాత్మక కార్పొరేట్ సంస్థలన్నింటికి ఈ సంస్థనే సేవలందిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), (NATA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు మరెన్నో సహా అనేక లాభాపేక్ష లేని సంస్థలలో భాగంగా వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో…
Travel expert ‘RL Tours & Travels’ celebrates 2nd Anniversary
Completes 2 years of its existence and emerging as one of the fastest growing travel agencies Hyderabad: One of the fastest growing travel agencies, Hyderabad-based RL Tours and Travels completes two years of its existence. RL Tours and Travels celebrated its 2nd anniversary with pomp and festivities to mark the occasion at Hyderabad today. A visionary corporate travel company, RL Tours and Travels provides air ticketing, customized group packages, VISA’s, forex, travel insurance and more. Their extensive client roster includes prestigious corporate names such as Maxivision, CloudTaro, Gnapika Entertainment, S.G…
ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనాన్ని నిర్మిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ
హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కు అన్ని హంగులతో అద్భుత భవనాన్ని నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిమాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తాము ఈ ఏడాది చివరి నాటికే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు అయినా సరే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో మహిళల సౌకర్యం కోసం…