అక్టోబర్ 2న అవతార్: ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్

Avatar: The Way of Water re-release on October 2nd
Spread the love

అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్‌తో 20th సెంచరీ స్టూడియోస్ వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్‌పీస్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2, 2025 న భారతీయ థియేటర్స్‌లో ఒక వారం పాటు 3D లో రీ-రిలీజ్ కానుంది. ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్‌లో విడుదలై, అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ మళ్లీ 3Dలో చూడటం ద్వారా, పాండోరా అద్భుతమైన అండర్‌వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీ హృదయానికి హత్తుకునే కథను పెద్ద తెరపై తిరిగి అనుభవించే అవకాశముంది. “ఈ అవకాశం మిస్ అవ్వకండి. మీరు ముందే ఈ మంత్ర ముగ్ధమైన లోకాన్ని చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా – ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th సెంచరీ స్టూడియోస్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 2, 2025 నుంచి ఒక వారం పాటు, భారతీయ థియేటర్స్‌లో – 3Dలో అవతార్: ది వే ఆఫ్ వాటర్!

Related posts

Leave a Comment