భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘హ్యాపీ రాజ్ ఈ నెల 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా…
Author: M.D ABDUL
‘పదే పదే’ మనసుని హత్తుకునే మెలోడీ..
‘పదే పదే ప్రాణం నిన్నే కోరగా/ కలే నిజం కాదా నిన్ను చేరగా/ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా/ ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ`..అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే ‘రాకాస’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ…
శ్రీదేవిని మించిన స్ట్రాటెజీతో..!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే? అందాల తార జాన్వీ కపూర్ అంటూ ఠక్కున సమాధానం వస్తే ఎలాంటి సందేహం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులతో ఆమె కెరీర్ అగమ్య గోచరంగా కనిపించింది. కానీ ఆ వైఫల్యాలను దాటుకొని ప్రస్తుతం శ్రీదేవి ముద్దుల కూతురు తన కెరీర్ను గాడిలో పెట్టుకొనే పనిలో పడింది. దక్షిణాదిలో అగ్రహీరోలతో కలిసి నటిస్తున్న ఆమె.. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేస్తున్నది. ప్రస్తుతం జాన్వీ నిర్ణయాలు బాలీవుడ్లో భారీ చర్చకు దారి తీసింది. ఆమె తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటనే వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే నిర్ణయం తీసుకొన్నప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ శ్రీదేవీ, బోనికపూర్ దంపతులు ఆమెను ప్రముఖ నిర్మాణ…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్గెస్ట్ మాస్బస్టర్ ‘కాలరే ఎత్తరా’ విడుదల
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో ఈ గీతావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. ‘కాలరే ఎత్తరా’ పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎనర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్…
యుద్ధానికి సిద్ధమైన ‘వృషకర్మ’ యోధుడు
యువ సామ్రాట్ నాగ చైతన్య తన అప్ కమింగ్ నెవర్ బిఫోర్ మిథికల్ స్పెక్టకిల్ ‘వృషకర్మ’ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ సాధించిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.వి.సి.సి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, బాపినీడు ఈ వెంచర్ను సమర్పిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వృషకర్మ’ గ్లింప్స్ అన్ని ప్లాట్ఫామ్లు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. వెంటనే వైరల్ అయ్యి భారీ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంటెన్స్ విజువల్స్, పవర్ ఫుల్ వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచాయి, సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మేకర్స్ తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్యను ఫియర్సెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లో ప్రజెంట్ చేసే సరికొత్త స్టిల్స్ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు పాత్ర కోసం ఆయన చేసిన కఠినమైన ట్రాన్స్ఫర్మేషన్,…
ఆధునిక ఆశయాలతో ‘కార్మేని సెల్వం’ టీజర్
పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తో మంచి ఆసక్తిని పెంచగా.. గురువారం తెలుగు టీజర్ ను…
పల్లె భాషను నమ్ముకుని పరిశ్రమకు వచ్చాను : లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఇంటర్వ్యూ…
* ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్.. నా కెరీర్ లో ఎప్పుడూ లేనంత కిక్ ఇచ్చింది నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ తో ఇంటర్వ్యూ విశేషాలు… ‘ఆయా షేర్’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది? – ఆయా షేర్ పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచి…
‘దీవాన’ టీజర్ వచ్చేసింది..
‘శుభం’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రం ద్వారా స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. ‘దీవాన’ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ‘దీవాన’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమా ఫీల్ కలుగుతోంది. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ఓ పెళ్లి వేడుకల్లో హీరోయిన్ ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుంటాడు. ఆ అమ్మాయి…
సంయుక్త మీనన్: ఇకపై డబ్బింగ్ కు రెడీ..
‘ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా..’ అంటోంది బ్యూటీ సంయుక్త మీనన్. టాలీవుడ్ లో చాలామంది కథానాయికలకు స్టార్డమ్ని అనుభవిస్తూ కూడా తెలుగు నేర్చుకోవాలనే తపన ఉండదు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తిసురేశ్, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్.. తదితర తారలు మాత్రం చక్కగా తెలుగు నేర్చుకొని, తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ, ఆదరించిన భాషపై అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తగా సంయుక్త మీనన్ కూడా చేరింది. రీసెంట్గా ఓ పాడ్కాస్ట్లో ఆమె తెలుగులో మాట్లాడినతీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ క్లిప్లు నెట్టింట వైరల్గా మారాయి. ‘తొలిరోజుల్లో నాకు అసలు తెలుగు రాదు.‘విరూపాక్ష’ చేస్తున్న టైమ్లో తెలుగు నేర్చుకోవాలని ఫిక్సయ్యాను. నేర్పేందుకు ట్యూటర్లను పెట్టుకున్నాను. వారివల్లే ఇంత త్వరగా మాట్లాడగలుగుతున్నా. ప్రస్తుతం తెలుగు నా మాతృభాషలాగే మారిపోయింది. ఇకపై…
ఘనంగా నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కు ‘కత్తి’ కాంతరావు స్మారక జాతీయ పురస్కారం
– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలకు సత్కారం భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నటప్రపూర్ణ కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ కు అందజేశారు. ఘనంగా జరిగిన ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి IAS, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ నటి కవిత, తెలంగాణ ఎఫ్ డీసీ ఎండీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ శ్రీమతి ప్రియాంక, దర్శకులు ప్రేమ్ రాజ్, విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్, నాగబాల డి.సురేష్ కుమార్, గీత రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీ చిత్తరంజన్, శ్రీ…
