(చిత్రం : భద్రకాళి, విడుదల : 19 సెప్టెంబర్ 2025, రేటింగ్: 2.5/5, నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురగన్, తృప్తి రవీంద్ర తదితరులు. దర్శకత్వం: అరుణ్ ప్రభు, నిర్మాత, సంగీతం : విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫి: షెల్లీ కాలిస్ట్, ఎడిటర్: రేమాండ్ డెర్రిక్ క్రాస్టా, ఆర్ట్: శ్రీరామన్, సమర్పణ: మీరా విజయ్ ఆంటోని, బ్యానర్: విజయ్ ఆంటోని కార్పోరేషన్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, స్రవంత్ రామ్ క్రియేషన్స్. తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న తమిళ నటుల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. వినూత్న సినిమాలతో అలరిస్తూ వస్తున్నఅతడు సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే విభిన్నతరహా పాత్రల్లో కనిపిస్తూ .. నటుడిగా సెలెక్టివ్ సినిమాలతో కెరీర్ లో ముందుకెళ్తున్నారు. విజయ్ ఆంటోనికి…
Month: September 2025
‘కిష్కింధపురి’ చాలా బావుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా : మెగాస్టార్ చిరంజీవి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’ చిత్రాన్ని అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోలో తన రివ్యూని షేర్ చేశారు. నమస్తే. నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పండక్కి వస్తున్నారు నిర్మాత సాహూ గారపాటి గారి మరో చిత్రం కిష్కింధపురి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని అనిపించింది. ఆ సినిమాలో పనిచేసిన అందరికీ అభినందనలు. సాధారణంగా హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం…
18న రవీంద్రభారతిలో టియస్సార్ పుట్టినరోజు వేడుకలు
వాసురావు, కసిరెడ్డి, గుమ్మడి, ప్రధాన అర్చకులకు సత్కారాలు ప్రముఖ రాజకీయవేత్త కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈనెల 18వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు టియస్ఆర్ ఆధ్యాత్మిక కళా పరిషత్ కార్యనిర్వాహణా కార్యదర్శి డాక్టర్ ఎం.కె.రాము తెలిపారు. టి. సుబ్బరామిరెడ్డి ఆధ్యాత్మిక కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఆదివారం ఆయన వివరించారు. పూర్వ రాజ్యసభ సభ్యులు టిఎస్సార్ పుట్టినరోజు వేడుకలను ఆధ్యాత్మిక సాంస్కృతికోత్సవం గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టియస్సార్ పుట్టినరోజు సందర్భంగా గత కొన్నేళ్లుగా వందలాది ప్రముఖులను సత్కరించిన ఆయన ఈసారి సంగీత రంగం నుంచి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు (చెన్నై), సాహిత్య రంగం నుంచి ఆచార్య డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, రంగస్థలం నుంచి కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ లను ప్రత్యేకంగా సత్కరిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆధ్యాత్మిక…
“అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ” బయోపిక్ టైటిల్ హక్కులు మాకే సొంతం, “ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ” మూవీ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – వీఎన్ఆర్ ఫిలింస్
అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ తో వీఎన్ఆర్ ఫిలింస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ చిత్రానికి ఎ.ఆర్.బి. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ హక్కులు తమకే సొంతమని, ఈ టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని వీఎన్ఆర్ ఫిలింస్ వెల్లడించింది. అయితే ఎలాంటి టైటిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో ఊషారాణి మూవీస్ బ్యానర్ లో వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్ దర్శకుడిగా సినిమా రూపొందిస్తున్నారు. ఈ విషయంపై వీఎన్ఆర్ ఫిలింస్ స్పందిస్తూ – అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్…
“The title rights for Apara Annapurna Dokka Seethamma biopic belong solely to us; we will take legal action against the producer of Andhrula Annapurna Dokka Seethamma” – VNR Films
VNR Films is producing a biopic titled Apara Annapurna Dokka Seethamma, and regular shooting is set to begin soon. Currently, the casting and technical crew selection is underway. The film is being produced by A.R.B. and directed by Achhartha Rajubabu. VNR Films has stated that they own the official rights to the title Apara Annapurna Dokka Seethamma, which has been registered with the Film Chamber. However, another film titled Andhrula Annapurna Dokka Seethamma is being produced under the banner of Usha Rani Movies, with Valluri Rambabu as the producer and…
Mirai Movie Review in Telugu: అడ్వెంచరస్ ప్రయాణం!
(చిత్రం : మిరాయ్, విడుదల : 12 సెప్టెంబర్ 2025, రేటింగ్ : 3.5/5 నటీనటులు: తేజ సజ్జ, రితిక నాయక్, మంచు మనోజ్, శ్రియా శరన్, జగపతిబాబు, జయరాం, గెటప్ శీను, పవన్ చోప్రా, తంజా కెల్లర్ తదితరులు , ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌరా హరి, ప్రసాద్ డైలాగ్స్: మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల, బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని) సూపర్ హీరోస్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ‘అవెంజర్స్’. అసలు ఈ సిరీస్లో వచ్చిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించాయో.. ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే సరిగ్గా గమనిస్తే ఈ…
సినీ ప్రముఖుల సమక్షంలో ‘ప్రేమతో దెయ్యం’ ట్రైలర్ విడుదల
బి.కె.ఎస్ దర్శకత్వంలో బి గణేష్, బద్దెల శ్రీనివాస్, నవ్యశ్రీ తదితరులు ప్రధానపాత్రల్లో శ్రీ లక్ష్మీ హనుమ శివపార్వతి బ్యానర్ పై హరి ఓం తపశ్రిత సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమతో దెయ్యం’. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదలయింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందిందని దర్సకుడు బి.కె.ఎస్ తెలిపారు. నిర్మాత బి. కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను నిర్మించామన్నారు. సినిమాలో ప్రతీ ఒక్కరినీ కదిలించే సన్నివేశాలు ఉంటాయన్నారు. ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపినట్టు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రసన్నకుమార్ , అనుపమారెడ్డి టీజర్ ని విడుదల చేయగా, సముద్ర, శివనాగు సాంగ్స్ , తుమ్మలపల్లి సత్యనారాయణ ట్రైలర్ ని విడుదల చేశారని చెప్పారు. విజయచిత్ర…
The memories of Kandiganti Rakesh will never be erased..
K.She Kandiganti Rakesh’s family members on his first anniversary Hyderabad, September 10 (Times News): “Your death has touched our hearts. Your memories will never fade. Even though you are not physically here, they will always be with us,” said Kee. She Kandiganti Rakesh, his wife Shilpa, family members, brothers Raju, Ravi, Vijay, Ramu and Madhu. “Although your indelible smile remains in our minds forever. Your death is an irreplaceable loss for us. Even though you have been away from us for a year, your sweet memories.. memories are still in…
‘మిరాయ్’ విజువల్ వండర్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది : హీరోయిన్ రితికా నాయక్
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు? -నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడుమిరాయ్ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది.…
JNJ సభ్యుల రిలే దీక్ష
– పేద జర్నలిస్టులు ఓ ఇంటివాళ్ళను చేయండి – JNJ సొసైటీకి కేటాయించిన స్థలాలు అప్పగించాలి – ప్లాట్లు చేసుకునేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించండి – సీఎం రేవంత్ రెడ్డికి JNJ సభ్యుల వినతి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 38 ఎకరాలు అప్పగించి ఏడాది పూర్తి అయింది.. అయినా ప్రభుత్వ అధికారులు కేసులు ఉన్నాయన్న సాకుతో సొసైటీకి పెట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతో పేద జర్నలిస్టులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1100 మంది సీనియర్ జర్నలిస్టుల్లో సగం మందికి పైగా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇప్పటికే 80 మంది జర్నలిస్టు మృత్యువాత పడ్డారు.. మరో 300 మంది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారు. జర్నలిస్టుల జీవితకాల కోరిక అయిన సొంత గూడు…