-చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో పాటు మా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా దర్శకుడు లక్ష్మణ్ విలేఖర్లతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆస్తికర విషయాలను పంచుకున్నారు. ప్రశ్న: దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? లక్ష్మణ్: మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. అందరి దర్శకుల లాగే చిన్నప్పటి నుంచే…
Year: 2022
‘అల్లూరి’కి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘అల్లూరి’ అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్స్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం…
నవంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ సినిమా
గౌరవం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. శిరీష్ నుంచి చివరగా వచ్చిన “ఎబిసిడి” చిత్రం ఊహించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా,శిరీష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.ఆ తరువాత ఇప్పటివరకు శిరీష్ నుంచి సినిమాలు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ లో చేసిన సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.…
టాలీవుడ్ లో న్యూ ప్రామిసింగ్ గ్లామరస్ హీరోయిన్ గా మారుతున్న మీనాక్షి చౌదరి
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్గా నిలిచి 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం మెప్పించకపోయిన ఈ ముద్దుగుమ్మ అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయినప్పటికీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హీటెక్కించింది…
Happy Birthday To The Director Of Blockbuster Entertainers Sreenu Vaitla.. New Biggie Announcement Soon !!
Sreenu Vaitla has carved a niche for himself in making Blockbuster Entertainers. He is a trend setter in blending comedy in commercial cinema with unique characters and timing. Sreen Vaitla has started his journey as a Director in a very successful manner. He won Prestigious Nandi Award for The Best Debut Director for his first film as a director ‘Nee Kosam’. He created sensation in the film industry with Anandam starring all new comers. Then there is no turning back for him with back to back Superhits like Venky, Dhee,…
విలక్షణ శైలితో బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్స్ అందించిన దర్శకుడు శ్రీను వైట్ల కి హ్యాపీ బర్త్ డే.. అతి త్వరలో తను దర్శకత్వం వహించనున్న భారీ చిత్రం ప్రకటన !!
తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి దర్శకుడు శ్రీను వైట్ల ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నీ కోసం తో దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రీను వైట్ల. అందరూ కొత్తవారితో నిర్మించిన ఆనందం తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, తో మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల దూకుడు తో తిరుగులేని హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన బాద్ షా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను…
నాగ చైతన్య – వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రం NC 22 ప్రధాన సాంకేతిక విభాగం, క్రియేటివ్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్
అక్కినేని నాగ చైతన్య తన కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ చిత్రానికి NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 చైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభుకి ఇది తొలి తెలుగు చిత్రం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్లో చార్ట్బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి. నాగచైనత్య కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో NC22 ఒకటి. ఈ సినిమా…
ప్రారంభమైన ధనుష్, సందీప్ కిషన్ ‘కెప్టెన్ మిల్లర్`
జాతీయ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గురువారంనాడు చెన్నైలో ప్రారంభమయింది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న వెర్సటైల్ నటుడు సందీప్ కిషన్, ధనుష్ సరసన నటించనున్న బ్యూటీఫుల్ నాయిక ప్రియాంక మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ తన అద్భుతమైన ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వస్తున్న అప్డేట్తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ అద్భుతమైన స్టార్ కాస్ట్ కాంబినేషన్తో, ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరయ్యేలా ఉంటుంది. ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం…
‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ చిత్రం: హీరో నాగశౌర్య ఇంటర్వ్యూ..
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ‘కృష్ణ వ్రింద విహారి’ కథ ఎప్పుడు విన్నారు .. ? – ‘కృష్ణ వ్రింద విహారి’ కథ 2020 కోవిడ్ ఇంకా మొదలవ్వకముందే విన్నాను. కథ వినగానే నచ్చేసింది. వెంటనే సినిమాని చేస్తానని దర్శకుడితో చెప్పా. మంచి ఫన్, ఎంటర్ టైమెంట్, ఫ్యామిలీ, మాస్..ఇలా అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ…
30 ఏళ్ల స్నేహం ఓ కుటుంబాన్ని నిలబెట్టింది!
టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్-శివాజీ రాజాల మంచి మనసులు సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి 30 ఏళ్ల స్నేహం ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. అదేమిటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే శివాజీ రాజా ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త్వరలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. నిజానికి శివాజీ రాజా ప్రెసిడెంట్ గా ఈసారి బరిలోకి దిగాలని భావించారు. కానీ ప్రెసిడెంట్ గా ఆది శేషగిరి రావు గారు బరిలో దిగుతున్నారని తెలుసుకొని ఆయన మీద గౌరవంతో తిరిగి…
