ఈ శుక్రవారమే విడుదలైన ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎఫ్ 3 యూనిట్ ఆదివారంనాడు హైదరాబాద్ లోని థియేటర్లో పర్యటించింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, నేను చాలా రోజుల తర్వాత ఎఫ్3లో ఇలా కనబడ్డాను. అనిల్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మీరందరూ కుటుంబంలో ప్రతి వారికి చెప్పండి. మరోసారి కరోనా వేవ్ రాకుముందే అందరూ సినిమా చూడండి అంటూ పేర్కొన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, రెండేళ్ళనాడు ఎఫ్3 మొదలుపెట్టినప్పుడు థియేటర్ లో అందరూ పిల్లలతోసహా కుటుంబం నవ్వుతుంటే థియేటర్ లో స్పీకర్లు దద్దరిల్లాలని అనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. పాండమిక్ వచ్చాక…
Year: 2022
నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ అందుకోవడం ఆస్కార్ కన్నా గొప్పవిషయం : ‘మేజర్’ ప్రీరిలీజ్ వేడుకలో అడివి శేష్
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ ప్రమోషన్ లో భాగంగా ఆదివారం నాడు వైజాగ్ పర్యటించారు. ముందుగా సినిమాను ప్రదర్శించి ఆ తర్వాత ప్రీరిలీజ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. నిర్మాతల్లో ఒకరైన శరత్ మాట్లాడుతూ, మా టీమ్ అంతా వైజాగ్…
కిచ్చా సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు వుండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ…
‘వాంటెడ్ పండు గాడ్’ జూన్ నెలాఖరు లేదా జూలై తొలి వారంలో విడుదల : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు
శతాధిక చిత్ర దర్శకుడు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. జనార్ధన మహర్షి కథ నాకు వినిపించారు. హిలేరియస్గా అనిపించింది. నిజానికి తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామని అనుకున్నారు. పెళ్లి సందD సినిమాకు శ్రీధర్ సీపాన అద్భుతమైన డైలాగ్స్ను అందించాడు. దాంతో తనే వాంటెడ్ పండుగాడ్ సినిమాను…
అసలు సినిమా ఇప్పుడే మొదలయ్యింది : రామ్ గోపాల్ వర్మ
– శేఖర్ రాజు కేసుకి సంబంధించిన వర్మ తెలిపిన పూర్తి వివరాలు ”2019 ఆఖర్లో శేఖర్ రాజు అనబడే వ్యక్తి దిశా ఎన్కౌంటర్ అనే సినిమా తొలి కాపీ 3 కోట్ల ఫస్ట్ కాపీ వ్యయంతో నాతో నిర్మించడానికి ఒప్పుకోవడం జరిగింది. శేఖర్ రాజు 56 లక్షల వరకు ఇఛ్చి షూట్ మొదలు పెట్టిన తర్వాత తన వద్ద ఇంకా డబ్బులు లేవని , ఎక్కడినుంచో రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పడం జరిగింది. అలా అయితే ఇంక సినిమా షూటింగ్ ఆపేస్తున్నానని , ఇంకో నిర్మాత ఎప్పుడైనా వస్తే రిలీజ్ అయ్యే టైంకి తన డబ్బు తిరిగిస్తానని ఒప్పుకున్నాను” అని తెలిపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… చాలా నెలల తర్వాత మరో…
వర్మ నిన్ను వదలా..నీ సినిమాలేవీ విడుదల కానివ్వను : నిర్మాత నట్టి కుమార్ ఫైర్
తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ, తిరిగి వారిమీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శక, నిర్మాత ,రామ్ గోపాల్ వర్మ దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మరో నిర్మాత శేఖర్ రాజు, అడ్వొకేట్ నిఖిల్ తో కలసి ఆయన మాట్లాడారు. ఆర్జీవీ మోసగాడని మొదట తనకు తెలియదని, అందుకే ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశానని అన్నారు. అయితే డబ్బులు ఎగగొట్టడమే పనిగా పెట్టుకున్న వర్మ తను మాకు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ,, సంతకాలను సైతం ఫోర్జరీ అని ప్రచారం చేస్తూ, తమపైనే అక్రమ కేసులు పెడుతుండటం ఆయన క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనమని నట్టి కుమార్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే తనను ఎదుర్కొనే ధైర్యం లేక,…
Actor Kiran Abbavaram’s next film goes on floors in Hyderabad
The upcoming film titled ‘Rules Ranjan’ starring the happening actor Kiran Abbavaram went on floors on Friday following a pooja ceremony here in Hyderabad. The film is being produced under Star Light Entertainment Pvt Ltd . Starring Kiran Abbavaram, the film also features comedian-actor Vennela Kishore, Satya, Annu Kapoor (Bollywoood), Siddarth Sen (Bollywood), Atul Parchure (Bollywood), Ashish Vidhyardhi, Ajay among other star casts. Rathinam Krishna has penned the story and is also heming the project. The pooja ceremony was held in Hyderabad city amidst much funfare . Prominent filmmaker Krish gave the clap…
అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి : ఊట్కూరి సురేష్ గౌడ్ డిమాండ్
ఆలేరు : అర్హులైన బీడీ కార్మికులకు అందని పెన్షన్ అనర్హులకే అందుతుంది. అర్హులు అయిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నాయకులు, బీర్ల ఫౌండేషన్ యువజన నాయకుడు ఊట్కూరి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ … ఆలేరులో నిరుపేద అర్హులైన బీడీ కార్మికులను ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీడీలు చేసి కుటుంబాలను పోషిస్తున్న నిరుపేద ఆడపడుచులకు అర్హులైన వారి లో కొందరికి పెన్షన్ అందడం లేదు. 2017 నుండి PF కట్ అయి ఉన్న వారికి ఏమో పెన్షన్ రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ లబ్ధిదారులకు రాక దాదాపు 5 ఏండ్లనుండి నష్టపోతున్నారని, ఎందుకు ఈ…
పద్మశ్రీ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ
తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ నగర్ లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందమూరి జయకృష్ణగారు శ్రీమతి& శ్రీ గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు గారు శ్రీ నందమూరి మాధవి మణి సాయికృష్ణ గారు శ్రీమతి లక్ష్మి హరికృష్ణ గారు శ్రీనందమూరి మోహన కృష్ణ గారు (విగ్రహ దాత) శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిగారు శ్రీమతి&శ్రీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారు శ్రీనందమూరి రామకృష్ణ గారు శ్రీమతి&శ్రీ కంటమనేని ఉమ మహేశ్వరి శ్రీనివాస ప్రసాద్ గారు శ్రీనందమూరి జయశంకర్ కృష్ణ గారు శ్రీమతి పరిటాల సునీత, జి. ఆది శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహా ఆవిష్కర్త:…
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ‘బింబిసార’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్
NTR..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుుగ వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. మే 28న ఆయన జయంతి. ఆయనకు ఇది శత జయంతి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారే కాదు.. ప్రపంచంలోని తెలుగువారందరూ ఆయన శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ చిత్రం నుంచి పోస్టర్…
