పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరో రానా మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న ‘విరాటపర్వం’ విశేషాలివి. * అరణ్య నుండి విరాటపర్వంలోకి రావడం ఎలా అనిపించింది ? -అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది.(నవ్వుతూ) గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు.,నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ.…
Year: 2022
‘గాడ్సే’తో టాలీవుడ్ లో అడుగుపెట్టడం హ్యాపీగా ఉంది : ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ..
వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటించింది. సినిమా విడుదల సందర్భంగా ఐశ్వర్య లక్ష్మీ ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే… – నేను హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి మూడేళ్లు అవుతుంది. నా తొలి చిత్రాన్ని మలయాళంలో చేశాను. రెండో చిత్రాన్ని తెలుగులోనే చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత దర్శక నిర్మాతలు అనుకున్న పాత్రలకు నేను సూట్ కాకపోయి ఉండొచ్చు. వచ్చిన పాత్రలు నాకు నచ్చలేదు.. ఇలా పలు కారణాలతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను.…
‘విక్రమ్’ను బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : కమల్ హాసన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు అతిధిగా హాజరయ్యారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. విక్రమ్…
ఇన్స్టాగ్రామ్లో సమంత నెల సంపాదన ఎంతో తెలుసా?
దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న టాలీవుడ్ బ్యూటీ సమంతకు ఇన్స్టాగ్రామ్లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘ఫ్యామిలీమెన్-2’’ వెబ్సిరీస్తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఈ భామ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రకటనల ద్వారా నెలకు మూడు కోట్ల వరకు ఆర్జిస్తున్నదని సమాచారం. నెలకు మూడు కోట్లా..? అని ఆశ్చర్యపోకండి! సోషల్మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నాయి. ఈ వరుసలో సమంత ముందున్నది చెబుతున్నారు. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల్లో పలు బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలు జోరుగా కనిపిస్తున్నాయి. యువతరంలో ఈ భామకున్న క్రేజ్ దృష్ట్యా ఇన్స్టాగ్రామ్ ప్రకటనల కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నదని…
ఆహా ఒరిజినల్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు. రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, “అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య.” https://fb.watch/dy_MnVIpVj/ ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని…
జూన్ 17న తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఈవెంట్ జరగబోతోంది..అందరూ ఎంజాయ్ చేయండి : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
అత్యుత్తమమైన తెలుగు గాత్రాన్ని కనుగొనే ఉద్దేశంతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియన్ ఐడల్ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్ ఐడల్ షో ముగింపుకు వచ్చింది. స్వర మాధుర్యంతో అలరించిన ఐదుగురు ఫైనలిస్టులతో ఓ ప్రోగ్రాంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి షోను ఓ టీంగా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. టీంగా మేం గెలిచాం. గత ఆరు నెలలుగా ఈ టీంతో ప్రయాణిస్తూ వచ్చాను. నాకు చాలా సిగ్గు. కానీ నేను ఎలా మారిపోయానో నాకే తెలియడం లేదు. ఆ స్పేస్ క్రియేట్ చేసిచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన నన్ను రెండు విషయాల్లో చాలా మార్చారు. నేను చాలా లో స్టేజ్లో ఉన్నప్పుడు…
M.S.Raju’s ‘7 Days 6 Nights’ new breezy Trailer captivates huge interest!!
While the release date nears, Mega maker M.S.Raju’s latest youthful entertainer ‘7Days 6 Nights’ new Trailer gets huge response from audience. The crazy & breezy trailer starred Sumanth Ashwin and Meher Chahal as the leads with Rohan & Krithika Shetty’s playing crucial role in the movie. Speaking on the occasion, Hero & Producer Sumanth Ashwin says “Shot uncompromised in the exquisite locations around Hyderabad, Bangalore, Udipi, Gokarna & Goa. We’re very happy with the crazy response to our breezy new trailer. With this kind of response, we await a huge…
ఎం.ఎస్. రాజు ‘7 డేస్ 6 నైట్స్’ ట్రైలర్ కి అనూహ్య స్పందన!!
ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’ తో గతేడాది బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. సరికొత్త ట్రీట్మెంట్ తో, విజువల్స్ తో ట్రైలర్ లో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ తో పాటు రోహన్, క్రితిక శెట్టి మరో జంటగా కనిపించారు. కామెడీ తో యూత్ ఫుల్ కంటెంట్ ని కలిపి పూర్తిగా ఆకట్టుకునే విధంగా చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని…
అత్యంత వైభవంగా భువనగిరి ఈనాడు జర్నలిస్ట్ అహమ్మద్ కుమార్తె వివాహ వేడుక
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఈనాడు సినీయర్ పాత్రికేయులు అహమ్మద్ కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్ నాగోల్ లోని జె కన్వెన్షన్ రిసార్ట్స్ లో శుక్రవారం జరిగిన ఈవేడుకలో అహమ్మద్ బంధు, మిత్రులతో పాటు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వివాహ మహోత్సవానికి హాజరైన వారిలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్ ఎం.డి అబ్దుల్, జర్నలిస్టులు శ్రీనివాస్ (ఈనాడు), యంబ నరసింహులు (సాక్షి), కృష్ణారెడ్డి (ఆంధ్రజ్యోతి) తదితరులు ఉన్నారు ఈ సందర్బంగా నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు.
కళ్యాణం..కమనీయం!!
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ హైదరాబాద్: నాగోల్ బండ్లగూడలోని పీబీఆర్ కన్వెన్షన్ లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు, ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్ కరస్పాండెంట్ వెల్జాల చంద్రశేఖర్ కుమార్తె గౌతమి-హరీష్ కుమార్ గౌడ్ ల వివాహానికి, కొత్తపేట లోని శ్వేతా గార్డెన్స్ లో జరిగిన ‘ప్రజాపక్షం’ న్యూస్ ఎడిటర్ బిఎల్ నారాయణ కుమార్తె మైత్రేయి- ప్రసాద్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు. ఈ వేడుకలో ఐజేయూ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే నాయకులు ఏ.రాజేష్, మల్లయ్య, వెంకటేశ్వర రావు, శిగా శంకర్ గౌడ్, పి.వి.మదన్ రావు, ఎం.డి. అబ్దుల్ తదితరులు హాజరయ్యారు.
