శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రూపొందించిన 2023 నూతన డైరీని శుక్రవారం నాడు తన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు తమకు సహరించాలని అయన సూచించారు.నూతన డైరీలోమీడియా సమాచారం పొందుపరచటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు,సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బి .గోపరాజు,రాఘవేందర్ రెడ్డి,టీ . శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ను నూతన పాలకమండలి తరపున అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, పూల మొక్కను అందజేసి , శాలువులతో సత్కరించారు . ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలికి డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.
Related posts
-
ఇద్దరూ ఇద్దరే : పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు!
Spread the love ఇద్దరూ ఇద్దరే .. పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు! ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ అద్భుత... -
నేత్రపర్వంగా విశిష్ఠ నృత్యార్పణం !
Spread the love ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా... -
19న ప్రవాస నర్తకి విశిష్ఠ భరతనాట్యం
Spread the love ప్రముఖ యువ నృత్య కళాకారిణి విశిష్ఠ డింగరి భరతనాట్య ప్రదర్శనతో నృత్యార్పణం చేయనున్నారు. ముంబయి కి చెందిన నృత్యోదయ...