యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఆదర్శనగర్ లో శ్రీ శ్రీ శక్తి గణపతి వద్ద పూజా కార్యక్రమం ఇన్చార్జి కో-ఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇన్చార్జి కో-ఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాట్లాడూతూ… నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు.. ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. విభిన్న రూపాల వినాయకుల శోభాయాత్ర.. భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలతో ఘనంగా సాగింది. ఈ నవరాత్రుల్లో గణపతి వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించిన ప్రతిఒక్కరినీ నీలం పద్మ వెంకటస్వామి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కరోనా మహమ్మారి నుండి ప్రజలందరు విముక్తులు కావాలని శ్రీ శక్తి గణపతిని పూజించడం జరిగిందని వివరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో అనురాధ, ఝాన్సీ, మంజుల, భారతి, యశోద, సురేఖ, కళ్యాణి, రాధా, రాకేశ్, సాయి తేజ, బి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...