వన్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు నటించిన చిత్రం ‘బెస్ట్ కపుల్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు, అదే కోవలో మా ‘బెస్ట్ కపుల్’ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ఈ ‘బెస్ట్ కపుల్’లో ఉన్నాయని దర్శకుడు గణేష్ దోరాల తెలిపారు.
జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్: వన్ మీడియా ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే – డైరెక్షన్: గణేష్ దొరల, ప్రొడ్యూసర్: పార్ధు రెడ్డి, మ్యూజిక్ : మహర్ష్ రవి చంద్ర, రైటర్: అభిషేక్ మోగలపు, పి.ఆర్.ఓ : శ్రీధర్