త్వ‌ర‌లోనే అడివి శేష్ గూఢ‌చారి సీక్వెల్

adivi Sesh's Goodachari Sequel Announcement Soon
adivi Sesh's Goodachari Sequel Announcement Soon
Spread the love

దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ మేజ‌ర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో అడివి శేష్‌. ఈ సినిమా మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వ‌గానే అడివి శేష్ త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం గూఢ‌చారి సినిమా సీక్వెల్‌ను చేయ‌బోతున్నారు. గూఢ‌చారి సినిమా విడుద‌లై మంగ‌ళ‌వారం(ఆగ‌స్ట్‌3) నాటికి మూడేళ్లు పూర్త‌య్యాయి. ఈ నెల‌లోనే గూఢ‌చారి సీక్వెల్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను చేయ‌బోతున్నారు. గూఢ‌చారి మ‌ళ్లీ వ‌స్తున్నాడు.. ఈ నెల‌లోనే ప్ర‌క‌ట‌న ఉంటుంది` అంటూ మేక‌ర్స్ తెలిపారు.ఈ రోజుతో గూఢ‌చారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్ల‌లు చాలా ఇష్ట‌ప‌డి చూశారు. ఆగ‌స్ట్ నెల నాకు బాగా క‌లిసొస్తుంది. ఈ నెల‌లోనే నా నెక్స్‌ట్ సినిమా G2(గూఢ‌చారి2) కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను“ అంటూ అడివిశేష్ ట్వీట్ చేశారు. గూఢ‌చారి చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియజేస్తారు.