తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను రమేష్ ప్రసాద్ కలిసి ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి KCR కు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు, ప్రభుత్వానికి రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ తో షూటింగ్ లు లేక, సుమారు ఏడాది పాటు థియేటర్ లు మూతబడి చిత్ర పరిశ్రమలో ని వేలాది మంది అనేక ఇబ్బందుకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగంపై ఆధారపడి న వారందరిలో మనోధైర్యాన్ని ఇచ్చిందని మంత్రికి మరోసారి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చలన చిత్ర పరిశ్రమలోని ని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని ముఖ్యమంత్రి KCR దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...