యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ మున్సిపల్ పరిధిలోని మైనార్టీ యువజన విభాగం షాబుద్దీన్, ముజాహిద్ పాషా నాయకత్వంలో సుమారు 100 మందికి పైగా మైనారిటీ సభ్యులు ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని యాదగిరిగుట్ట లోని తమ నివాసంలో కలిశారు. ఆలేరు నియోజకవర్గంలోని మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినట్టు, దానికి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆలేరులో పట్టణంలో మైనార్టీ బిల్డింగ్ మంజూరు కోసం మర్యాదపూర్వకంగా కలిసినట్టు మైనారిటీ నాయకులు తెలిపారు. ఈసందర్బంగా చైర్మన్ గొంగిడిని కలిసినవారిలో ఫయాజ్, జమాల్, అష్షు, రఫీ, అస్లాం, రైష్ తదితరులు ఉన్నారు.
డిసిసిబి చైర్మన్ గొంగిడిని కలిసిన ఆలేరు పట్టణ మైనారిటీ యువజన విభాగం
