జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా వనం

జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా వనం
Spread the love

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె ..ఐజేయు) ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులుగా సీనియర జర్నలిస్ట్, “మన తెలంగాణ”దిన పత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ వనం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో విజయవంతంగా జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మూడవ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయూ)జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గతంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా యూనియన్ కు సేవలు అందించిన వనం నూ ఈసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు గత 20 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో వార్త దినపత్రికలో పనిచేసి ప్రస్తుతం ‘మన తెలంగాణ’ దినపత్రిక లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ గా ఉన్నారు.

Related posts

Leave a Comment