తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె ..ఐజేయు) ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులుగా సీనియర జర్నలిస్ట్, “మన తెలంగాణ”దిన పత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ వనం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో విజయవంతంగా జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మూడవ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయూ)జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గతంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా యూనియన్ కు సేవలు అందించిన వనం నూ ఈసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు గత 20 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో వార్త దినపత్రికలో పనిచేసి ప్రస్తుతం ‘మన తెలంగాణ’ దినపత్రిక లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ గా ఉన్నారు.
Related posts
-
ఇద్దరూ ఇద్దరే : పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు!
Spread the love ఇద్దరూ ఇద్దరే .. పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు! ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ అద్భుత... -
నేత్రపర్వంగా విశిష్ఠ నృత్యార్పణం !
Spread the love ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా... -
19న ప్రవాస నర్తకి విశిష్ఠ భరతనాట్యం
Spread the love ప్రముఖ యువ నృత్య కళాకారిణి విశిష్ఠ డింగరి భరతనాట్య ప్రదర్శనతో నృత్యార్పణం చేయనున్నారు. ముంబయి కి చెందిన నృత్యోదయ...