చిన్నారికి బీర్ల ఐలయ్య ఆర్థిక సాయం

కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్చార్జి
Spread the love

వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి గురువారం కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్చార్జి బీర్ల ఐలయ్య హియరింగ్ ఎయిడ్ మిషన్
కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన అంగడి శ్రీనివాస్ కుమార్తె రిషిక (13) పుట్టుక నుంచి వినికిడి సమస్యతో బాధపడుతున్నది. కుటుంబ సభ్యులు ఆమెను అనేక ఆసుపత్రులు చూపించినప్పటికీ ఫలితం లేకపోగా హియరింగ్ ఎయిడ్ మిషన్ వాడాలని వైద్యులు సూచించారు. ఆ మిషన్ కొనుక్కోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బీర్ల ఐలయ్యను కుమార్తె తండ్రి ఆశ్రయించారు. చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయిన ఐలయ్య వెంటనే హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుగోలుకు తగిన ఆర్థిక సాయం అందించారు. ప్రతిరోజు బడికి వెళ్లి మంచిగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని పలువురికి ఆదర్శంగా నిలవాలని రిషికకు సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

Leave a Comment