ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మతిభ్రమించింది : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

aler news
Spread the love
  • మహిళలందరూ భార్యలా
  • బతుకమ్మ సందర్భంగా మహిళలకు తీవ్ర అవమానం
  • ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి

తెలంగాణా మహిళలు అందరూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు భార్యలని స్టేషన్ ఘణపురం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనటం చాలా భాదాకరమని ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిపిసిసి మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అన్నారు.ఎంఎల్ఏ రాజయ్య మహిళల పట్ల మాట్లాడిన సంఘటనపై ఆదివారం విలేఖరులతో మాట్లాడారు.బతుకమ్మ చీరల పంపిణీలో ఎంఎల్ఎ రాజయ్య తెలంగాణ మహిళలందరికీ కెసిఆరే భర్త అని మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.తెలంగాణ మహిళలకు కేదిఆర్ భర్త అయితే భార్యను ఉన్న ఆ భర్తలు ఎవరో తెలపాలని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు,మంత్రులకు మతిభ్రమించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని తెలంగాణ మహిళలకు బతుకమ్మ తరపున మాట్లాడి అవమానించిన టిఆర్ఎస్ పార్టీ కి ఎంఎల్ఏ లకు మంత్రులకు బుద్ది చెబుతారని అన్నారు.దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళలకు ఉన్న గుర్తింపు ప్రశంసించాల్సింది పోయి పిచ్చిమాటలు మాట్లాడటం ఏమిటని మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని విమర్శించారు.ఈఅంశంలో ప్రతి ఇంట్లో భార్యలు, ఆడపడుచులు ఉంటారని ఆ వాఖ్యలు ఎంఎల్ఏ ,మంత్రులు,ఎంపిలతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా వర్తిస్తుందని అన్నారు. వంద రూపాయలు ఖరీదు చేయని చీరలు పంచుతూ మహిళలను ఎన్నో మాటలు అంటూ కించపరిచిన రాజయ్య భార్యకు కూడా కేసిఆర్ భర్తనా మరి రాజయ్య ఎవరని ప్రశ్నించారు. ఎంఎల్ఏగా మహిళలకు గౌరవం ఇవ్వాల్సింది పోయి పిచ్చిగా మాట్లాడినందుకు తెలంగాణా మహిళలందరికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మంత్రి మల్లారెడ్డి,మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యేలు ఈవిధంగా మాట్లాడటం సిగ్గుచేటని వారిని పదవులనుండి వెంటనే భర్తరఫ్ చేసి క్షమాపణలు చెప్పాలని లేనిచో కాంగ్రేస్ మహిళా శక్తి ఏమిటో చూపిస్తామని నీలం పద్మ హెచ్చరించారు.

Related posts

Leave a Comment