టాలీవుడ్ లో ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా తన కెరీర్లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే తప్పకుండా ఉండి ఉంటుంది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే ‘జన గణ మన’. పూరీకి ఎప్పట్నుంచో కోరిక ఈ ప్రాజెక్ట్ చేయాలని. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని ఎన్నో సంత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. అది విడుదలైన టైమ్లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నిజానికి ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చే సమయానికి సరైన మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. అదే సినిమాకు కలిసొచ్చింది కూడా అని టాలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. ఇస్మార్ట్ హిట్తో బ్లాక్బస్టర్ కమ్బ్యాక్ ఇచ్చినా కూడా పూరీ మాత్రం తర్వాతి సినిమా కోసం చాలా రోజుల పాటు వేచి చూసాడు. చివరికి విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయ్యింది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్తో ఆగస్ట్ 25న ‘లైగర్’ విడుదల కానుంది. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత పూరీ ఏం చేయబోతున్నాడనే ప్రశ్నకు సమాధానంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ పేరు వినిపిస్తుంది. ఈ కథ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. కానీ ఆయన చేయను అనేసరికి ఇప్పుడు ఇదే కథను చాలా మంది స్టార్ హీరోల దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ మధ్య కన్నడ హీరో, కేజియఫ్ స్టార్ యశ్ను కూడా కలిసి కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్ లాంటి హిందీ హీరోలను కూడా ట్రై చేసాడు పూటి జగన్నాథ్. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు హీరో దగ్గరే ఈ కథ ఆగిపోయినట్లు తెలుస్తుంది. ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండతోనే ‘జన గణ మన’ పాడించాలని చూస్తున్నాడు. ‘లైగర్’ లో విజయ్ నటనకు.. డెడికేషన్కు ఫిదా అయిపోయిన పూరి.. తన డ్రీమ్ ప్రాజెక్ట్కు సరైన హీరో ఆయనే అని ఫిక్స్ అయిపోయాడని తెలుస్తుంది.
పూరీ ‘జన గణ మన’లో హీరో ఎవరో తెలుసా?!
