-చిరంజీవికి లేఖ రాసిన సినీపరిశ్రమ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) అధ్యక్షుడు అనీల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి పి ఎస్. ఎన్. దొర
కరోనా మహమ్మారీ నుంచి సినీకార్మికులను కాపాడేందుకు సీసీసీని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి సెకండ్ వేవ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకుల్ని నెలకొల్పి సేవలందించారు. చిరంజీవి ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల సేవలతో ఎందరో కరోనా బాధితులు ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. క్రైసిస్ కష్టకాలంలో ఆర్టిస్టులు సహా 24 శాఖల కార్మికుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. కష్టంలో సినీకార్మికులను ఆదుకున్న చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీపరిశ్రమ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) చిరంజీవికి లేఖను రాసింది. తాజాగా సినీకార్మికుడి కుటుంబాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుంది. తల్లి బిడ్డలు రక్తం అందక కష్టంలో ఉంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి సకాలంలో రక్తాన్ని అందించి వారి ప్రాణాల్ని కాపాడారు. దీనిపై స్పందిస్తూ కార్మిక సమాఖ్య మరోసారి పాదాభివందనాలను తెలియజేసింది. చిరంజీవి గారూ.. మీరు మన సినీ కార్మికులకు ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మీరు చేసే ప్రతి సేవ జీవితాంతం గుర్తుంటుంది. అందులో భాగంగా.. భాస్కర్ అనే సినీ కార్మికుని భార్య డెలివరీ సమయంలో చావు బ్రతుకులలో ఉండగా తల్లి బిడ్డలకు రెండు దఫాలుగా బ్లడ్ ఇచ్చి బ్రతికించిన మీకు మా పాదాభివందనాలు
అంటూ ఫెడరేషన్ ఎమోషనల్ గా లేఖను రాయడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. రక్తదానం కోసం అర్ధరాత్రి వెళ్ళి అడిగినా వెంటనే స్పందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున అధ్యక్షుడు అనీల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి పి ఎస్. ఎన్. దొర ధన్యవాదములు తెలియజేసారు.