తెలంగాణలో ‘శని’ పోయే కాలం దగ్గర్లోనే ఉంది.. త్వరలోనే కేసీయార్ పీడ విరగడ కానుంది: ప్రొఫెసర్ కోదండరామ్

genral news
Spread the love

సెల్ ఫోన్ తోనే ప్రభుత్వానికి చెక్ పెడాదం: పాశం యాదగిరి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికల పొట్ట కొడుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్ప డుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కప్పర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ నాడు ప్రొఫెసర్ జయ శంకర్ తమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత కన్నా ఇంకా ఎక్కువ పోరాటం చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలోని వాళ్లు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే, చాలా మంది తమ లాంటి వారు మనుషుల్లా బతుకు తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా రోజుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కనీస సహకారం కూడా అందించ లేదని అవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలో హెలికాప్టర్ మనీ పేరుతో కేసీయార్ చేసిన హడావిడి చూసి ప్రజల్లో ఉన్నా భరోసా కూడా కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది రాష్ట్ర ప్రజలు ఉరేసుకుని చస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ గోదావరి నది నీళ్లు చూసి వస్తున్నరని వ్యంగ్యం చేశారు. వార్తలో సత్యం ఉంటే జనాలు తప్పకుండా ఆదరిస్తారని, రాష్ట్ర ప్రజల సమస్య లపై తెగింపు తోనే కొట్లడాలని సూచించారు. ఆంధ్రోళ్లను దింపిన మనకు ఈ కేసీయార్ ను దింపడం చాలా సులభం అని, నిలబడి తెగించి, తేల్చుకుందాం అంటూ పిలుపు ఇచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధం లేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో శని పోయే కాలం దగ్గర్లోనే ఉందని, త్వరలో కేసీయార్ పీడ విరగడ కానుందని వ్యాఖ్యానించారు.
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం కనిపించక పోయిన కనీసం పరిపాలన కనిపించాలని, ప్రెస్ అకాడమీ కి పూర్తి స్థాయి సభ్యులు లేరని,
పెట్టుబడికి, కట్టు కథకు పుట్టిన విష పుత్రికలు పత్రికలు అని ధ్వజమెత్తారు. ఉంపుడు గత్తెలు, పెంపుడు కుక్కలు గా పత్రికలు మారి పోయయని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టింది జర్నలిస్టులే అని, సెల్ ఫోన్ తోనే ప్రస్తుత సమాజాన్ని శాసించ వచ్చు అని పేర్కొన్నారు.
చిన్న, మద్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న పత్రికలకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు పూర్తిగా ఆగిపోయాయని, ఈ విషయమై పలువురు ప్రభుత్వ ప్రతినిధులకు విన్నవించినా పలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సమాచార కమిషనర్ కు పూర్తి స్థాయి సభ్యులను నియమించాలని, అర్హులైన జర్నలిస్టు లకు అక్రి డేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మైనారిటీ జర్నలిస్టుల ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ దినపత్రికలకు అండగా ఉంటాం : ప్రోఫెసర్ కోదండరాం

ప్రాంతీయ దినపత్రికలకు అండగా ఉంటాం అని తెలంగాణ జన సమితి ప్రోఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు జర్నలిస్టులు ప్రభుత్వం వేధిస్తుందన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే,
ప్రజల కడగండ్లు తొలగిపోవాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న పత్రికలు జర్నలిస్టుల సమస్యలపై చిన్న పత్రికల సంఘం, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ యూసుఫ్ బాబు, పలువురు నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను భవిష్యత్తు లేని తెలంగాణగా కెసిఆర్ మారుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు మరోసారి ప్రజా పోరాటం చేసి తెలంగాణను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కొప్పుర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి చిన్న పత్రికల సంపాదకులతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై పోరాటం చేసే వారు అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాలని సూచించారు.

Related posts

Leave a Comment