కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ తేజ – భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా దర్శకుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్ లాంచ్ చేయగా.. ఫస్ట్ లుక్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. అనంతరం చీఫ్ గెస్ట్ దర్శకులు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా…