ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అలరించిన సమంత ఇప్పుడు ఓటీటీ వేదికగానూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఫ్యామిలీమెన్ 2’లో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మరో సరికొత్త సిరీస్లోనూ సమంత నటించడానికి సిద్ధమయ్యారు. రాజ్ అండ్ డీకే సారథ్యంలో రూపొందబోయే పీరియాడిక్ ఫాంటసీ సిరీస్లో సమంత నటించబోతున్నారట. ఆదిత్య రాయ్కపూర్, వామికా గబ్బీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘తుంబాద్’ వంటి మిస్టీరియస్ థ్రిల్లర్ తీసిన రాహి అనిల్ బార్వి దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ప్లిక్స్ వెల్లడించనుంది. ఇప్పటివరకూ భారతీయ సినిమా తెరపై రాని సరికొత్త కథాంశంతో ఈ సిరీస్ను తీయబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సిరీస్ చూస్తున్న ప్రేక్షకుడిని మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుందట. మోసం, నమ్మకద్రోహం, ప్రేమ, త్యాగం…