‘నరసింహ’కు సీక్వెల్‌ గా ‘నీలాంబరి’

'Neelambari' is the sequel to 'Narasimha'

రజనీకాంత్‌ హీరోగా 1999లో విడుదలైన ‘నరసింహ’ చిత్రం ఓ మైల్‌ స్టోన్‌ అని చెప్పొచ్చు. ఆయన అందుకున్న బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ టైటిల్‌ పాత్ర పోషించగా ఆయనకు భార్యగా వసుంధర పాత్రలో  సౌందర్య నటించారు. నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతున్నా ఈ పాత్ర ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. డిసెంబర్‌ 12న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ‘నరసింహ’ను రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ రీరిలీజ్‌ ప్రచారంలో భాగంగా రజనీ ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు. అందులో రజనీకాంత్‌ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టి థియేటర్లలోకి వచ్చిన…