“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి1, బాహుబలి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ని సొంతం చేసుకున్న “రెబల్స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్స్టార్” కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూపర్హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్లుక్కి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నవరాత్రులు అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్…