స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు ఆధ్వర్యంలో రిలేదీక్ష : మైనారిటీ సోదరీమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం

general news

శనివారం గాంధీభవన్ లో ఉదయం 10.గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్ష స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు గారి ఆధ్వర్యంలో మైనారిటీ సోదరిమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇతర భారతీయులతో పోలిస్తే ముస్లిములు సమాన హక్కులను పంచుకుంటారు అయితే హిజాబ్ పై నిషేధం దించడం ద్వారా హక్కులను బలహీన పరిచేందుకు బిజెపి. ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్తుంది. యూపీ మరియు ఇతర రాష్ట్రాల ఎన్నికలలో హిందుత్వ ఓటర్లను సేకరించేందుకు బిజెపి మతం కార్డు ప్లే చేస్తుంది. ఈ నిషేధం భారతీయుల లౌకికవాదానికి ముప్పు కలిగిస్తుంది. హిజాబ్ ముస్కాన్ మాండ్యా విద్యార్థిని వ్యక్తిగత స్వేచ్ఛ. హిందువులకు సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ తాము ఏమి ధరించాలి .ఎలా ఉండాలి. ఏం చేయాలి అన్న విషయాలపై…

జర్నలిస్టులను ఎప్పుడూ గౌరవిస్తాను: ఆర్మూర్ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి

General news

– మీడియా స్వేచ్చకు భంగం కలిగిస్తే ఊరుకోను -మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నాను తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు జర్నలిస్టులను నేను ఎంతో గౌరవిస్తున్నాను… ఇవ్వాళ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి జర్నలిస్టు మిత్రులే ప్రధాన కారణం… ఉద్యమంలో జర్నలిస్టులు నాకు అందించిన ప్రోత్సాహాన్ని జీవితంలో మరచిపోలేను….. తన నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను… ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే….. భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతానని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆర్మూర్ శాసన సభ్యులు ఏ.జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ సాక్షి విలేఖరి పోశెట్టిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) జిల్లాలో ఆందోళన…

తెలంగాణ కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నీలం పద్మ వెంకటస్వామి

neelam padma venkataswamy

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నీలం పద్మ నియమితులయ్యారు . ఈ సందర్బంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కో -ఆర్డినేటర్ , యా దాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ తనను 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. అవి.. 1. పెద్ద పెళ్లి, 2. కరీంనగర్, 3. చొప్పదండి, 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. మానకొండూరు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి డిజిటల్ సభ్యత్వాలను అధిక సంఖ్యలో చేపడుతామని అన్నారు. నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించి తన నియామకానికి సహకరించిన పిసిసి చీఫ్ రేవంత్…

ఆలేరులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

General News Aler

(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) దేశ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావనికి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 జయంతి సందర్భంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులో ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐలయ్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, టౌన్ అధ్యక్షులు MA, ఏజాస్, మండల్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వర్రాజ్,ఈ కార్యక్రమం లో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు జహంగీర్, ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్, యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్,ప్రభు, శ్రీను,టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాసుల భాస్కర్,అంగిడి ఆంజనేయులు NSUI మండల్ అధ్యక్షులు సుంకరి విక్రమ్,కేతావత్ రాహుల్, మైనారిటీ టౌన్ అధ్యక్షులు md బాబా, నరేష్ తదితరులు…

విప్లవ స్వాప్నికుడు కామ్రేడ్ బండ్రు నరసింహులు || నేల రాలిన ఎర్ర మందారం

Bandrunarashimhulu

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, CPI (ML) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) జనవరి 22,2022న మ. 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారంరోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు స్వస్థతపొంది 21 జనవరి రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. నిండు నూరేండ్లు బతకమనే పెద్దల దీవేనలన్నీ అపహాస్యమవుతూ రైతాంగపు బలవన్మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలు, రాజ్యమేలుతున్న సమయంలో తూటాలు దిగిన శరీరంతో ఏటికి ఎదురీదుతూ నూరెండ్లుగా విప్లవ రాజకీయాలలో కొనసాగడం మామూలు విషయం కాదు. అమరులు వేసిన విప్లవ…

ఉపాధ్యాయుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

Neelam padma

(T-Times News – ALER) ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు గుండెపోటుతో బలవన్మరణానికి పాల్పడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని దుయ్యబట్టారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే…

జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి: టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీష్ రావు

Journalists Dairy

కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం నాడు కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రూపొందించిన మీడియా డైరీ-2022ని ఆవిష్కరించి మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాబోవు 45రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నందున గతంలో తమ ప్రభుత్వం ప్రత్యేక  క్యాంపులను నిర్వహించి వేలాది మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే…

నిజాయితీ పాలనకు నిదర్శనం బిజెపి ప్రభుత్వం : బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్

ALER BJP NEWS

(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు ) పాలనలో స్వార్దం లేకుండా నిజాయితీ గా పరిపాలన కొనసాగిస్తే దేశ ప్రజలు అంతే విధంగా బాగుంటారని బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో రెండు రోజుల బిజెపి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయిస్తూ నిజాయితీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోఅనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పధకాలకు తమ సొంత పేరు పెట్టుకొని ప్రజలకు అందిస్తుందని‌ చెప్పారు.మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.తెలంగాణ లోని…

ఆలేరులో మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం : నియామక పత్రాలు అందజేత

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ చైతన్యవంతంగా పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి మహిళ ఒక ఆదిశక్తి గా మారి శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఎక్కడైనా నా మహిళలపైన సంఘటన జరిగితే వెంటనే మహిళా కాంగ్రెస్ ముందుంటుందని వారికి న్యాయం జరిగేంత వరకు…

ఆలేరులో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎం.ఏ ఏజాజ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ప్రతీ ఏడు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు నిర్వహించడం జరుగుతుందని, ఎందరో నిరుపేదలకు సాయం చేస్తూ అడుగడుగునా నేనున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎల్లవేళలా ముందుంటున్నారని, అందులో భాగంగానే కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగామ ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి,…