భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

ఈరోజు మాజీ మంత్రివర్యులు స్టార్ కాంపెయిన్ చైర్మన్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను జూబ్లీహిల్స్లోని స్వగృహం లో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం శాలువాతో సన్మానం చేయడం కేక్ కటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి ఎల్లముల సంజీవరెడ్డి స్టేట్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విద్యా, సెక్రెటరీ పావని సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు

TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు : బొట్ల పరమేశ్వర్

TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు : బొట్ల పరమేశ్వర్

ఆలేరు: TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని నిండు మనస్సుతో ఆకాంక్షించారు.

దళిత సీఎం ‘డిక్లరేషన్’ కావాలి !

దళిత సీఎం 'డిక్లరేషన్' కావాలి !

By Sk.Zakeer, Editor,Bunker News : దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది .రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా ఇంకేమి చేస్తుంది.కాంగ్రెస్ సన్నాసుల మఠం కాదు కదా ! తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన ప్రాధాన్యత అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘వరంగల్ డిక్లరేషన్’ సభలో అన్నారు.ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ మాట ఎందుకు ? ఎవరు సీఎం కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవర్ని అధికారంలోకి తీసుకురావాలన్నది ప్రజలు ఇవ్వనున్న అంతిమతీర్పు! ‘డిక్లరేషన్’ అంటే తెలుగులో వాంగ్మూలం అనీ,ప్రకటన అనీ,నివేదిక అనీ…

రాహుల్ పర్యటన ‘ఫైర్ బ్రాండ్’కు అగ్నిపరీక్ష !!

Rahulghandhi-Revanthreddy

By Sk.Zakeer, Editor, Bunker News : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్ర, శనివారాల్లో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను విజయవంతం చేయడం రేవంత్ కు కత్తిమీద సాము లాంటిది.రేవంత్ రాజకీయ చతురతకు,పరిణతికి, శక్తి సామర్ధ్యాలకు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ సాధనకు సంబంధించిన అగ్ని పరీక్ష ఇది.ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.రైతులతో పాటు దళితులు, బహుజనులు, అట్టడుగువర్గాలు, విద్యార్థులు, యువత,నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా రాహుల్ పర్యటన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి వంటి వారు పోటీ పడినా రాహుల్ గాంధీ ప్లస్ పార్టీ హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు జూపడం వల్ల ఆయనకే పీసీసీ…

ప్రభావశీల నాయకులు మోడీ-కేసీఆర్ !

KCR-Mod

Sk.Zakeer, Editor, Bunker News: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న నాయకులని ఒక సర్వే వెల్లడించింది. వాగ్ధాటి,ప్రజల్ని మంత్ర ముగ్దుల్ని చేయగల ప్రసంగాలలో ఈ ఇద్దరికీ ఎవరూ సాటిలేరు.ప్రభావశీలుడైన నాయకుడు ప్రధాని మోడీతో టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్‌ పోటీ పడుతున్నారు.తెలంగాణ యాసతో కూడిన ప్రసంగం… అందులో దొర్లే సామెతలు,ఆకట్టుకునే నినాదాలు కేసీఆర్ సొంతం. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు వలన కేసీఆర్ ‘ప్రత్యేక’ నాయకునిగా గుర్తింపు పొందుతున్నారు. భాషా పటిమలో మమతా బెనర్జీ,స్టాలిన్,జగన్,నితీష్ కుమార్,ఉద్ధవ్ థాకరే వంటి ముఖ్యమంత్రులను కూడా ఆయన ఎప్పుడో వెనక్కి నెట్టిపారేశారు. ”గాడిదలకు గడ్డేసి… ఆవులకు పాలు పిండితే వస్తాయా?: కత్తి ఇంకొకనికి ఇచ్చి .. ఇంటోన్ని యుద్ధం చేయమంటే కుదురుతదా”? అంటూ ఉద్యమ కాలంలో ఆయన సంధించిన మాటలు తూటాల వలె…

ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ రాహుల్ శ్రీకారం !!

Rahul-Gandhi

Zakeer, Editor, Bunker News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వరంగల్ లో శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు.ఆయన పర్యటనతో రాజకీయంగా మైలేజ్ సంపాదించడానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది.సెంటిమెంట్ రాజకీయాలు ‘తల్లివేరు’గా ఉన్న టీఆర్‌ఎస్‌ను అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలన్నది టీపీసీసీ కాన్సెప్ట్.ఓయూ విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ‘ఓయూ’ కేంద్రంగా రాజకీయం నడపాలని,అధికార టిఆర్ఎస్ ను డిఫెన్సులో పడేయాలని టీపీసీసీ భారీ వ్యూహాన్ని రచించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ‘పికప్’ కాలేకపోతున్నదో రాహుల్ గాంధీ తన పర్యటనలో తెలుసుకోబోతున్నారు.పార్టీ కార్యకర్తలతో,పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ ఆయన సమావేశమవుతారు.అనుమతి లభించకపోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకెళ్లడానికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాహుల్ గాంధీ…

‘పీ.కే’ రాజకీయ ప్రత్యక్షం.. విఫల ప్రయోగం కానున్నదా ?

Prashant-kishor

By Sk.Zakeer, Editor, Bunker News : ”రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు ” అని టిఆర్ఎస్ నిర్మాత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్న మాట.నిజమే మరి ! రాజకీయపార్టీ పెట్టడానికి ఒక ప్రాతిపదిక తప్పనిసరి.తాత్విక భూమిక అవసరం.ప్రజల నుంచి డిమాండ్ రావాలి.కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ మాటలు అంటుంటారు.2001 లో ఆయన పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక ‘తెలంగాణ’ ఆకాంక్ష.ప్రత్యేక తెలంగాణ డిమాండును ఇరుసుగా చేసుకొని కేసీఆర్ 21 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని నిర్మించారు.ఇప్పుడా పార్టీ తెలంగాణలో ఎంత శక్తివంతంగా మారిందో,కెసిఆర్ ఎదురులేని మనిషిగా ఎట్లా మారారో కండ్ల ముందు కనబడుతున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయపార్టీని స్థాపించబోతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.ఇందుకు కారణం ఆయన ట్రాక్ రికార్డు.ఆయనకు ఉన్న నెట్ వర్క్. కనీసం ఐదారుగురు…

ప్రజల హృదయాల్లో కేసీఆర్ కు సుస్థిరస్థానం : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్

ప్రజల హృదయాల్లో కేసీఆర్ కు సుస్థిరస్థానం : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదిక వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం చేసిన‌ అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందడుగు వేశారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వ‌టుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వ‌రకు 21 ఏండ్లుగా ప్రజ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు.…

కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం ఆలేరు మండల అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ... ''నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని విభాగాలలో బలోపేతం చేస్తూ నా విధిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రతిక్షణం కార్యకర్తలతో అధికారం కోసం పోరాడుతాను. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని బందారపు మధు గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ… ”నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని…