YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) visited to greet & congrats MOHD. IBRAHIM (shadnagar constituency incharge) congratulations for appointing as shadnagar constituency incharge With MOHD. TAHER KHAN (RJNR minority president) & Dr.sajid ali softskill trainer)& salma Begum RJNR DIV (mahila president
Category: Politics
SHAHNAWAZ KHAN flag hoisting ceremony at YSR TELANGANA PARTY OFFICE (lotuspond)
Today SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a flag hoisting ceremony at YSR TELANGANA PARTY OFFICE (lotuspond) on the occasion of TELANGANA FORMATION DAY with all our rajendra nagar division leaders and executive members.
వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక
హైదరాబాద్: వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా సల్మాబేగం మాట్లాడుతూ నన్ను వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవికి తగిన న్యాయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సూచనలను పాటిస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు శ్రమించనున్నట్టు పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నందుకు వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లోని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్…
అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ ‘రచ్చబండ’లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ
ఉపాధి లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాల్లేక కూలీలుగా మారిన యువతను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడాలి. ఇలాంటి పాలకులను మనము గెలిపించినందుకు మన తప్పును మనమే సరిదిద్దుకోవాలి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రం వచ్చిన తర్వాత 8500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా అక్కున చేర్చుకో లేనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు పిసిసి అధ్యక్షులు రేవంతన్న అన్నట్టుగా…
అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి : ఊట్కూరి సురేష్ గౌడ్ డిమాండ్
ఆలేరు : అర్హులైన బీడీ కార్మికులకు అందని పెన్షన్ అనర్హులకే అందుతుంది. అర్హులు అయిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నాయకులు, బీర్ల ఫౌండేషన్ యువజన నాయకుడు ఊట్కూరి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ … ఆలేరులో నిరుపేద అర్హులైన బీడీ కార్మికులను ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీడీలు చేసి కుటుంబాలను పోషిస్తున్న నిరుపేద ఆడపడుచులకు అర్హులైన వారి లో కొందరికి పెన్షన్ అందడం లేదు. 2017 నుండి PF కట్ అయి ఉన్న వారికి ఏమో పెన్షన్ రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ లబ్ధిదారులకు రాక దాదాపు 5 ఏండ్లనుండి నష్టపోతున్నారని, ఎందుకు ఈ…
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఘనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి 12గంటలకు ఇండియా గేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్టార్ క్యాంపానర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఎలిమినేట్ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్ ఆలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్ ఆలేరు యూత్ మాజీ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్ గౌడ్ , మహేష్. యువజన కాంగ్రెస్ తుర్కపల్లి, మండల ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ. రవితేజ అసెంబ్లీ అధ్యక్షులు పాల్గొన్నారు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
ఈరోజు మాజీ మంత్రివర్యులు స్టార్ కాంపెయిన్ చైర్మన్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను జూబ్లీహిల్స్లోని స్వగృహం లో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం శాలువాతో సన్మానం చేయడం కేక్ కటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి ఎల్లముల సంజీవరెడ్డి స్టేట్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విద్యా, సెక్రెటరీ పావని సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు
TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు : బొట్ల పరమేశ్వర్
ఆలేరు: TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని నిండు మనస్సుతో ఆకాంక్షించారు.
దళిత సీఎం ‘డిక్లరేషన్’ కావాలి !
By Sk.Zakeer, Editor,Bunker News : దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది .రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా ఇంకేమి చేస్తుంది.కాంగ్రెస్ సన్నాసుల మఠం కాదు కదా ! తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన ప్రాధాన్యత అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘వరంగల్ డిక్లరేషన్’ సభలో అన్నారు.ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ మాట ఎందుకు ? ఎవరు సీఎం కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవర్ని అధికారంలోకి తీసుకురావాలన్నది ప్రజలు ఇవ్వనున్న అంతిమతీర్పు! ‘డిక్లరేషన్’ అంటే తెలుగులో వాంగ్మూలం అనీ,ప్రకటన అనీ,నివేదిక అనీ…
రాహుల్ పర్యటన ‘ఫైర్ బ్రాండ్’కు అగ్నిపరీక్ష !!
By Sk.Zakeer, Editor, Bunker News : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్ర, శనివారాల్లో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను విజయవంతం చేయడం రేవంత్ కు కత్తిమీద సాము లాంటిది.రేవంత్ రాజకీయ చతురతకు,పరిణతికి, శక్తి సామర్ధ్యాలకు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ సాధనకు సంబంధించిన అగ్ని పరీక్ష ఇది.ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.రైతులతో పాటు దళితులు, బహుజనులు, అట్టడుగువర్గాలు, విద్యార్థులు, యువత,నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా రాహుల్ పర్యటన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి వంటి వారు పోటీ పడినా రాహుల్ గాంధీ ప్లస్ పార్టీ హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు జూపడం వల్ల ఆయనకే పీసీసీ…