శ్రీకీర్తి నృత్య అకాడమి ఆధ్వర్యంలో మంగళవారం డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భాగ్యనగర్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ ఆంధ్రనాట్యం గురు డాక్టర్ సజని వల్లభనేని, డ్యాన్స్ ఇండియా సంపాదకులు డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న భాగ్యనగర్ నృత్యోత్సవాల్లో పాల్గొనేందుకు దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ప్రముఖ నాట్య కళాకారులు పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసారని వారు వివరించారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు. ఇటలీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సి, చౌ నృత్య కళాకారిణి ఇలియానా సిటారిస్టిని మహంకాళి మోహన్ జాతీయ స్మారక పురస్కారంతో సత్కరించనున్నారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ దివ్యసేన (భరతనాట్యం), కర్ణాటక…
Category: Others
నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సంకల్ప్ దివాస్’
హైదరాబాద్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని…
అపురూపం ఆలోచనాత్మకం దుశ్శల ఏకపాత్రాభినయం
* దుశ్శల పాత్రలో జీవించిన అలేఖ్య పుంజాల అభినయ తపస్వి డాక్టర్ అలేఖ్య పుంజాల మరోసారి తన నట విశ్వ సౌరభాన్ని చాటుకున్నారు. గాంధారి కుమార్తెగా, వంద మంది కౌరవులకు చెల్లెలు అయిన దుశ్శల పాత్రలో జీవించి రాణించి మెప్పించారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమి, సూత్రధార్ యాక్టింగ్ ట్రైనింగ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. 70 నిముషాలు పాటు నాన్ స్టాప్ అభినయ వాచకంతో ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. కూచిపూడి నాట్య గురువుగా నర్తకీమణి గా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తనదైన గుర్తింపు పొందిన అలేఖ్య పుంజాల ప్రత్యేక దుశ్శల పాత్రలో మంచి నటీమణి అని నిరూపించుకున్నారు. అనాదిగా…
పథకం ప్రకారమే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు
-మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతినిధి బృందం -కఠినచర్యలు తప్పవు కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా హామీ ఇచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్…
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి : గుంటి నగేష్
హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గుంటి నగేష్ కోరారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటి నాగేష్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజి ప్రజా సేవకే జీవితం అంకితం చేశారని, ఆయన జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. తొలిదశ, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాపూజీ కృషి చేశారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చరణ్ దాసు…
Kottha Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association
Warangal: Kotha Sri Priya has been appointed as the additional chairperson of the Telangana Gazetted Officers Association Central (State) Women’s Section. State chairperson Dr. G. Deepareddy announced the state committee of the association. Many are expressing happiness over the appointment of Kotha Sri Priya, who is working as a Business Support Officer in the Fertilizer Control Laboratory in Hanumakonda Subedari, Warangal district, as the chairperson of the Telangana State Gazetted Officers Association. To this extent, she was handed over the relevant appointment letters at a meeting held at the association…
ఘనంగా ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు వేడుక
హైదరాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. యువకళావాహిని ఉపాధ్యక్షులు ఎమ్.ఏ హమీద్ జన్మదినోత్సవం 14.9.2025 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గెట్ టు గెదర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణ తేజ, ఏసీపీ రాజశేఖర్, రెరా డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ, నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్, కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్…
JNJ సభ్యుల రిలే దీక్ష
– పేద జర్నలిస్టులు ఓ ఇంటివాళ్ళను చేయండి – JNJ సొసైటీకి కేటాయించిన స్థలాలు అప్పగించాలి – ప్లాట్లు చేసుకునేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించండి – సీఎం రేవంత్ రెడ్డికి JNJ సభ్యుల వినతి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 38 ఎకరాలు అప్పగించి ఏడాది పూర్తి అయింది.. అయినా ప్రభుత్వ అధికారులు కేసులు ఉన్నాయన్న సాకుతో సొసైటీకి పెట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతో పేద జర్నలిస్టులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1100 మంది సీనియర్ జర్నలిస్టుల్లో సగం మందికి పైగా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇప్పటికే 80 మంది జర్నలిస్టు మృత్యువాత పడ్డారు.. మరో 300 మంది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారు. జర్నలిస్టుల జీవితకాల కోరిక అయిన సొంత గూడు…
యువతులు ఫిట్నెస్పై దృష్టి సారించాలి : ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్
హైదరాబాద్: యువతులు, మహిళలు ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం వ్యాయామం, యోగ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలను అలవాటు చేసుకోవాలని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ సూచించారు. మంగళవారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఫిట్నెస్ క్యాంపులో మాట్లాడారు. క్షణం తీరికలేని నగర జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో పలు రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఊబకాయం వంటి సమస్యలతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో యుక్త వయసు నుంచే వ్యాయామం, జుంబా, డ్యాన్స్ వంటి ఫిట్నెస్ కార్యక్రమాలు చేయాలని అను ప్రసాద్ సూచించారు. విద్యార్థి దశ నుంచే వ్యాయామానికి సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చని కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఉదయశ్రీ…
Happy Birthday : చక్కని చిరునవ్వుకు సాక్షి పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి
ఘనంగా పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం హైద్రాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. సీనియర్ బీజేపీ నాయకులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి 42వ జన్మదినోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. రామంతాపూర్ పరిధిలోని కేసీఆర్ నగర్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి ఈ జన్మదినోత్సవాన్ని తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరుపుకున్నారు పోరెడ్డి రంగారెడ్డి -కే.శే. నారాయణమ్మల రెండవ కొడుకు అయిన పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి చిన్నప్పటి నుంచే అనురాగాలు.. ఆప్యాయతలకు పెట్టింది పేరుగా జీవనం సాగించారు. పోరెడ్డి మహేశ్వర్ రెడ్డికు భార్య మమత, ఇద్దరు పిల్లలు సంజన, సంకీర్త్ రెడ్డిలు. ఈ సందర్బంగా మారుపాక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు…
