పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న చిత్రం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం. వెండితెరపై చెరగని సంతకం ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” ‘’భవదీయుడు భగత్ సింగ్” పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు ఉదయం 9.45 నిమిషాలకు…
Category: MOVIE REVIEWS
శ్రీ విష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం ‘భళా తందనాన’లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా ఫస్ట్ లుక్ విడుదల
శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న చిత్రం భళా తందనాన . ఈ సినిమాకు బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. కేథరిన్ థ్రెసా పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్ను రివీల్ చేశారు.చీరకట్టులో కేథరిన్ థ్రెసా అద్భుతంగా కనిపించారు. శశి రేఖ అనే పాత్రలో కేథరిన్ థ్రెసా కనిపించబోతోన్నారు. ఎంతో ధైర్యం కలిగిన అమ్మాయి పాత్రలో కేథరిన్ థ్రెసా అదరగొట్టనున్నారు. ఇక హీరో శ్రీ విష్ణును ఇది వరకెన్నడూ చూపించినటువంటి పాత్రలో ప్రజెంట్ చేయబోతోన్నారు దర్శకుడు చైతన్య. కేథరిన్ థ్రెసా అయితే ఎంతో సెలెక్టివ్గా సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటి హీరోయిన్కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. కేజీయఫ్ ఫేమ్ రామచంద్రరాజు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.వారాహి చలనచిత్రం బ్యానర్పై…
మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ఖిలాడి ఫస్ట్ సింగిల్ రిలీజ్
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇటీవల రవితేజ, డింపుల్ హయతి మీద తెరకెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు. రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.. రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అదరగొట్టారు. తెరపై ఈ జంట చూడముచ్చటగా ఉంది.ఇక ఈ పాటకు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి…
నితిన్, ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రేష్ట్ మూవీస్ ‘మాచర్ల నియోజకవర్గం’ పూజాకార్యక్రమాలతో ప్రారంభం
విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నితిన్ను ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై ఈ మూవీని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, నిర్మాత రామ్ మోహన్ కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశానికి అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వెంకీ కుడుముల స్క్రిప్టును మేకర్స్కి అందజేశారు. ఈ మూవీ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కొంత మంది రౌడీలు హీరో నితిన్పై అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మంటల్లో యాక్షన్…
ఈ ‘బర్త్ డే’కి నాకొక భారీ గిఫ్ట్: తుమ్మలపల్లి
“నిర్మాతగా నా వందో చిత్రం… వంద రోజుల సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన- “వంద సినిమాల దర్శకశిఖరం” రూపొందించనున్నారు. నిర్మాతగా నా స్థాయిని వంద రెట్లు పెంచే సదరు వందో చిత్రం అధికారిక ప్రకటన… వంద చిత్రాల దర్శకుడు అధికారికంగా అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ పుట్టినరోజుకు నేనందుకుంటున్న అతి పెద్ద కానుక ఇది. అంతేకాదు… నిర్మాతగా నాకిది “లైఫ్ టైమ్ అచీవ్మెంట్” లాంటిది” అంటున్నారు ప్రముఖ నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. సెప్టెంబర్ 10… తన 64వ పుట్టినరోజును పునస్కరించుకుని ఆయన మీడియాతో ముచ్చటించారు.“2021 నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. “జాతీయ రహదారి” 10 న విడుదలవుతోంది. ఈ సినిమా కచ్చితంగా అవార్డుల పంట పండిస్తుంది. నా పేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి దర్శకత్వంలో ప్రముఖ రచయిత యండమూరి అందించిన కథతో ‘తులసి తీర్ధం’…
రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే.. అదే తనీష్ “మరో ప్రస్థానం” స్పెషాలిటీ
ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఇది తనీష్ హీరోగా నటించిన “మరో ప్రస్థానం” సినిమాకి ఓ వరం అని చెప్పచ్చు. తనీష్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెలాఖరుకు “మరో ప్రస్థానం” చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.“మరో ప్రస్థానం” సినిమా విషయానికి వస్తే…రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే…
దేశానికే ఆదర్శం రామచంద్ర రెడ్డి గారి జీవితం : నీలకంఠ
( ప్రధమ భూదాన్ వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్ ) 1951 సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే.. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞంగా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్…
చిరంజీవి గారి సంకల్పం వల్లే కార్మికులకు వాక్సిన్ అందింది : తమ్మారెడ్డి భరద్వాజ
( సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ సెకండ్ డ్రైవ్ ) కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న కార్మికులు, నటీనటులు ఎందరో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ వేసుకున్నారు. తాజాగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం…
Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Production No 7 Titled Macherla Niyojakavargam
Versatile actor Nithiin who was seen in completely class and soft roles in his last few films will be playing an action-packed role in his next film under the direction of MS Raja Shekhar Reddy. The film to be produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner was launched today and as promised the makers have revealed its title through a motion poster.Few hooligans are seen coming to attack Nithiin, while the protagonist is ready to take on them. There’s fire all over. And the title is…
దసరా కానుకగా రిలీజ్ కానున్న విశాల్, ఆర్య, ఆనంద్ శంకర్, వినోద్ కుమార్ ఎనిమి
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమి’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ ప్యాక్డ్ టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఎనిమి చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో విశాల్, ఆర్యలు ఫిరోషియస్…
