మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ శుక్రవారం చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న…
Category: MOVIE REVIEWS
తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా, కార్మికుల సంక్షేమ సహకారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికులతో, 800 ప్రొడ్యూసర్స్తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. ఇప్పటివరకు టిఎఫ్సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాతలకు అత్యంత సులువుగా ప్రాసెస్ జరిపే సంస్థగా టిఎఫ్సిసి ప్రాచుర్యం పొందింది. ఇక ప్రస్తుతం 30 మందితో కూడిన టిఎఫ్సిసి పాలక కమిటీ గడువు ముగియనుండటంతో నవంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భగా డా.లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి…
‘నాట్యం’ యూనిట్కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నందమూరి బాలకృష్ణ అభినందనలు
ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్తో ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు నాట్యం సినిమాపై ప్రశంసలఝల్లు కురిపించారు.ఈ మేరకు వెంకయ్య నాయుడు సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు’ అని తెలిపారు.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన నందమూరి…
అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ‘ఆహా’లో ‘లవ్స్టోరి’ స్ట్రీమింగ్
నాగ చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్, శేఖర్ కమ్ముల టేకింగ్తో ‘లవ్ స్టోరి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ బస్టర్ అయిన చిత్రంగా‘లవ్స్టోరి’ నిలిచింది. ఇక నేడు (అక్టోబర్ 22) ఈ చిత్రం ఆహాలో రాబోతోంది. నేటి సాయంత్రం ఆరు గంటలకు ‘లవ్స్టోరి’ ప్రీమియర్ కాబోతోంది. ఈ క్రమంలో ఆహా టీం పైరసీ చేసే వారిని హెచ్చరించింది. ‘పైరసీని అరికట్టాలి. అందరూ ఆహాలోనే సినిమాను చూడండి. అది కూడా చాలా తక్కువ ధరలో అందిస్తున్నాం. రోజుకు ఒక్క రూపాయి చొప్పునే మీకు ఖర్చు అవుతుంది. మంచి క్వాలిటీతో సినిమాకు మీకు అందిస్తున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే డబ్బులు పెట్టి మనం ఎలా సినిమా చూస్తామో ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు…
సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతులమీదుగా ‘తీరం’ ట్రైలర్ విడుదల
నూతన యువకథా నాయకులు శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో యల్ యస్ ప్రొడక్షన్స్ సమర్పణలో అఖి క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్ పై అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు, మరో హీరో శ్రావణ్ వైజిటి, కెమెరామెన్ శ్రావణ్ జి.కుమార్, నటుడు అజాస్, సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బొలేమోని, నిర్మాత యం. శ్రీనివాసులు పాల్గొన్నారు.హీరో…
కదిలించే సినిమా ‘ఇట్లు అమ్మ’
నిశ్శబ్దంగా మసిలే జీవి అమ్మ.అమ్మ ఏమైనా చేయగలదు. ఎందుకో అమ్మలో ఈ పిచ్చి ప్రేమ. ఎందుకని అమ్మలందరూ పిచ్చిగా ప్రేమిస్తారు.ఊరికెనే ప్రేమిస్తారు.ఏ స్వార్థం లేకుండా ఎందుకు ప్రేమిస్తారో ఈ అమ్మలు.పిచ్చి అమ్మలు.పిల్లలను కళ్ళల్లో పెట్టుకొని జీవిస్తారెందుకో.అమ్మతనం ఎందుకో లోకానికి పిచ్చిగా తోస్తుంది.ఎందుకీ అమ్మలు నిశ్శబ్దంగా, నిరాడంబరంగా ఉంటారు?ఎందుకీ అమ్మలు రాజీ పడనంత ప్రేమతో నిండు కుండల్లా ఉంటారు.లేకపోతేఅమ్మ నిస్వార్థ ప్రేమ చింతనకు హంతకుడే కదిలి రావడమేమిటి?కొడుకుని చంపిన హంతకుడికైనా ప్రేమగా సపర్యలు చేసే అమ్మ క్షమకు సాటి ఏదైనా ఉందా?సాధారణంగా ప్రారంభమై సాగుతున్నా కొద్దీ అసాధారణంగా ఉత్థాన స్థితికి తీసుకెళ్తుందీ సినిమా.ప్రేమను హత్తుకున్న అక్షరాలతో కూడిన పత్రికా ఉత్తరాలు ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగిస్తాయి. మనవైన కథలు, మనవైన పరిసరాల్లో,మనదైన భాషతో వచ్చే సినిమాలు ఎంతగా హత్తుకుంటాయో. సామాజికంగా మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ అమ్మ…
తెలంగాణలో ‘శని’ పోయే కాలం దగ్గర్లోనే ఉంది.. త్వరలోనే కేసీయార్ పీడ విరగడ కానుంది: ప్రొఫెసర్ కోదండరామ్
సెల్ ఫోన్ తోనే ప్రభుత్వానికి చెక్ పెడాదం: పాశం యాదగిరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికల పొట్ట కొడుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్ప డుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కప్పర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ నాడు ప్రొఫెసర్ జయ శంకర్ తమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత కన్నా ఇంకా ఎక్కువ పోరాటం చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలోని వాళ్లు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే, చాలా మంది తమ లాంటి వారు మనుషుల్లా బతుకు తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా రోజుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కనీస…
‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఫస్ట్లుక్ విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి
దర్శకుడి ఊహను అర్థం చేసుకుని… అంతే అందంగా ప్రేక్షకులకు తన కెమెరా కంటితో చేరవేసేది ఛాయాగ్రాహకులే. సినిమా మేకింగ్లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఊహ, కెమెరా కన్ను ఒకరిదే అయితే? స్టోరీ టెల్లింగ్, సినిమా లుక్ హై స్టాండర్డ్స్లో ఉంటాయి. గతంలో మెగాఫోన్ పట్టిన సినిమాటోగ్రాఫర్స్ మంచి సినిమాలు అందించారు. దర్శకులుగా మారిన ఛాయాగ్రాహకుల జాబితాలో ఇప్పుడు ‘గరుడవేగ’ అంజి కూడా చేరనున్నారు. ‘ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు’ సినిమాటోగ్రాఫర్గా పరిచయమైన ఆయన… తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు పని చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితర దర్శకుల ఊహలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు ఓ సినిమాకు దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘టెన్త్ క్లాస్…
Hero Kartikeya’s ‘Raja Vikramarka’ to release in Theatres on November 12th
Young Hero Kartikeya Gummakonda is all set to entertain Telugu audience as a whimsy NIA agent in his much awaited Spy Action thriller “Raja Vikramarka” on November 12th.Produced by 88 Ramareddy, presented by T. Adi Reddy under Sree Chitra Movie Makers, director V. V. Vinayak’s associate, debutant Sri Saripalli is directing this project.Now, as the first copy of the film is ready, makers confirmed the theatrical release to be on November 12th.Speaking on the occasion, producer ’88’ Ramreddy says, “We can’t imagine anyone else as ‘Raja Vikramarka’ than Kartikeya. He…
Virat Raj in & as ‘Seeta Manohara Sri Raghava’ launched formally with pooja ceremony
‘Seeta Manohara Sri Raghava‘, a film starring yesteryear actor Haranath’s grand nephew Virat Raj in the lead, was today launched formally with pooja ceremony at Ramanaidu Studios in Hyderabad.Director Anil Ravipudi gave the first clap, while the camera was switched on by veteran producer A M Rathnam. Anil Ravipudi, A M Rathnam, Suresh Babu and other guests wished the team members all success in their new endeavour.The film directed by Durga Srivastasa K is produced by Sudhakar T on Vandana Moviees banner. It is tipped to be a lively youthful…
