హైద‌రాబాద్‌ లో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ‘విక్ర‌మ్’ ప్రీ రిలీజ్ వేడుక

హైద‌రాబాద్‌ లో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా 'విక్ర‌మ్' ప్రీ రిలీజ్ వేడుక

క‌మ‌ల్ సార్‌ లో దశావతారాలు కాదు. . శతావతారాలు కనపడతాయి – తొలి పాన్ ఇండియా స్టార్ క‌మ‌ల్ సారే : విక్ట‌రీ వెంక‌టేష్‌ అదే నాకు పి హెచ్‌ డి- క‌మ‌ల్‌హాస‌న్‌ నితిన్‌.. నువ్వు వెంకీలా క‌ష్ట‌ప‌డితే సూప‌ర్‌ స్టార్ అవుతావు : క‌మ‌ల్‌హాస‌న్‌ `క‌మ‌ల్ చేసిన ద‌శావ‌తారం వంటి సాహ‌సాన్ని మ‌రే న‌టుడు చేయ‌లేడు. `ఏక్ దూజేకెలియే` సినిమాతో ఆయ‌న పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయ‌న గ్లోబ‌ర్ స్టార్ కూడా` అని విక్ట‌రీ వెంక‌టేష్ అన్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై…

‘ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు’ సెట్లో ఎస్‌.వి. కృష్ణారెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌

'ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు' సెట్లో ఎస్‌.వి. కృష్ణారెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఎస్‌.వి.కృష్ణారెడ్డి చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు సోహెల్, మృణాళిని ర‌వి జంట‌గా డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్ త‌దిత‌ర తారాగ‌ణంతో రూపొందుతోన్న చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు. క‌ల్ప‌న చిత్ర బేన‌ర్‌పై క‌ల్ప‌న కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారంనాడు ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని రమడా మ‌నోహ‌ర్ హోట‌ల్‌లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఆహ్లాద‌ర‌కంగా జ‌రిగింది. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ… జ‌ర్న‌లిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన వేడుక జ‌ర‌గ‌డం ఆనందంగా వుంది. ప్ర‌తి ఏడాది వ‌చ్చేది. ఆత్మీయుల స‌మక్షంలో జ‌రుపుకోవ‌డంలో ఆనందం వేరుగా వుంటుంది. ఈ చిత్ర క‌థ న‌చ్చి ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు సినిమా తీయ‌డానికి కార‌ణ‌మైంది.…

వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక

వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక

హైదరాబాద్: వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా సల్మాబేగం మాట్లాడుతూ నన్ను వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవికి తగిన న్యాయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సూచనలను పాటిస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు శ్రమించనున్నట్టు పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నందుకు వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లోని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్…

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ ‘రచ్చబండ’లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ 'రచ్చబండ'లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

ఉపాధి లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాల్లేక కూలీలుగా మారిన యువతను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడాలి. ఇలాంటి పాలకులను మనము గెలిపించినందుకు మన తప్పును మనమే సరిదిద్దుకోవాలి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రం వచ్చిన తర్వాత 8500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా అక్కున చేర్చుకో లేనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు పిసిసి అధ్యక్షులు రేవంతన్న అన్నట్టుగా…

పాండ‌మిక్ త‌ర్వాత‌ ఫ్యామిలీతో థియేట‌ర్‌కు వ‌చ్చి’ఎఫ్3’ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం

పాండ‌మిక్ త‌ర్వాత‌ ఫ్యామిలీతో థియేట‌ర్‌కు వ‌చ్చి'ఎఫ్3'ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం

ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైన ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియ‌జేస్తూ ఎఫ్ 3 యూనిట్ ఆదివారంనాడు హైద‌రాబాద్‌ లోని థియేట‌ర్లో ప‌ర్య‌టించింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్‌ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సునీల్ మాట్లాడుతూ, నేను చాలా రోజుల త‌ర్వాత ఎఫ్‌3లో ఇలా క‌న‌బ‌డ్డాను. అనిల్‌ గారు నాకు అవ‌కాశం ఇచ్చారు. మీరంద‌రూ కుటుంబంలో ప్ర‌తి వారికి చెప్పండి. మ‌రోసారి క‌రోనా వేవ్ రాకుముందే అంద‌రూ సినిమా చూడండి అంటూ పేర్కొన్నారు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, రెండేళ్ళ‌నాడు ఎఫ్‌3 మొద‌లుపెట్టిన‌ప్పుడు థియేట‌ర్‌ లో అంద‌రూ పిల్ల‌ల‌తోస‌హా కుటుంబం న‌వ్వుతుంటే థియేట‌ర్‌ లో స్పీక‌ర్లు ద‌ద్ద‌రిల్లాల‌ని అనుకున్నాం. ఇప్పుడు అదే జ‌రిగింది. పాండ‌మిక్ వ‌చ్చాక…

నేష‌న‌ల్ సెక్యూరిటీ బ్లాక్ క‌మాండో మెడ‌ల్ అందుకోవ‌డం ఆస్కార్ క‌న్నా గొప్ప‌విష‌యం : ‘మేజర్’ ప్రీరిలీజ్ వేడుకలో అడివి శేష్

నేష‌న‌ల్ సెక్యూరిటీ బ్లాక్ క‌మాండో మెడ‌ల్ అందుకోవ‌డం ఆస్కార్ క‌న్నా గొప్ప‌విష‌యం : 'మేజర్' ప్రీరిలీజ్ వేడుకలో అడివి శేష్

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్‌. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌ టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర టీమ్ ప్ర‌మోష‌న్‌ లో భాగంగా ఆదివారం నాడు వైజాగ్ ప‌ర్య‌టించారు. ముందుగా సినిమాను ప్ర‌ద‌ర్శించి ఆ త‌ర్వాత ప్రీరిలీజ్ చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన శ‌ర‌త్ మాట్లాడుతూ, మా టీమ్ అంతా వైజాగ్…

కిచ్చా సుదీప్‌ ‘కే3 కోటికొక్కడు’ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్

కిచ్చా సుదీప్‌ ‘కే3 కోటికొక్కడు’ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు వుండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధాదాస్‌ కథానాయికలుగా నటించిన ఈ…

‘వాంటెడ్ పండు గాడ్’ జూన్ నెలాఖరు లేదా జూలై తొలి వారంలో విడుదల : ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

'వాంటెడ్ పండు గాడ్' జూన్ నెలాఖరు లేదా జూలై తొలి వారంలో విడుదల : ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లో మీడియా సమావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎంట‌ర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి క‌థ నాకు వినిపించారు. హిలేరియ‌స్‌గా అనిపించింది. నిజానికి త‌నికెళ్ల భ‌ర‌ణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామ‌ని అనుకున్నారు. పెళ్లి సంద‌D సినిమాకు శ్రీధ‌ర్ సీపాన అద్భుత‌మైన డైలాగ్స్‌ను అందించాడు. దాంతో త‌నే వాంటెడ్ పండుగాడ్ సినిమాను…

అసలు సినిమా ఇప్పుడే మొదలయ్యింది : రామ్ గోపాల్ వర్మ

అసలు సినిమా ఇప్పుడే మొదలయ్యింది : రామ్ గోపాల్ వర్మ

– శేఖర్ రాజు కేసుకి సంబంధించిన వర్మ తెలిపిన పూర్తి వివరాలు ”2019 ఆఖర్లో శేఖర్ రాజు అనబడే వ్యక్తి దిశా ఎన్కౌంటర్ అనే సినిమా తొలి కాపీ 3 కోట్ల ఫస్ట్ కాపీ వ్యయంతో నాతో నిర్మించడానికి ఒప్పుకోవడం జరిగింది. శేఖర్ రాజు 56 లక్షల వరకు ఇఛ్చి షూట్ మొదలు పెట్టిన తర్వాత తన వద్ద ఇంకా డబ్బులు లేవని , ఎక్కడినుంచో రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పడం జరిగింది. అలా అయితే ఇంక సినిమా షూటింగ్ ఆపేస్తున్నానని , ఇంకో నిర్మాత ఎప్పుడైనా వస్తే రిలీజ్ అయ్యే టైంకి తన డబ్బు తిరిగిస్తానని ఒప్పుకున్నాను” అని తెలిపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… చాలా నెలల తర్వాత మరో…

వర్మ నిన్ను వదలా..నీ సినిమాలేవీ విడుదల కానివ్వను : నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

వర్మ నిన్ను వదలా..నీ సినిమాలేవీ విడుదల కానివ్వను : నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ, తిరిగి వారిమీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శక, నిర్మాత ,రామ్‌ గోపాల్‌ వర్మ దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మరో నిర్మాత శేఖర్ రాజు, అడ్వొకేట్ నిఖిల్ తో కలసి ఆయన మాట్లాడారు. ఆర్జీవీ మోసగాడని మొదట తనకు తెలియదని, అందుకే ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశానని అన్నారు. అయితే డబ్బులు ఎగగొట్టడమే పనిగా పెట్టుకున్న వర్మ తను మాకు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ,, సంతకాలను సైతం ఫోర్జరీ అని ప్రచారం చేస్తూ, తమపైనే అక్రమ కేసులు పెడుతుండటం ఆయన క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనమని నట్టి కుమార్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే తనను ఎదుర్కొనే ధైర్యం లేక,…