వర్మ నిన్ను వదలా..నీ సినిమాలేవీ విడుదల కానివ్వను : నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

వర్మ నిన్ను వదలా..నీ సినిమాలేవీ విడుదల కానివ్వను : నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ, తిరిగి వారిమీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శక, నిర్మాత ,రామ్‌ గోపాల్‌ వర్మ దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మరో నిర్మాత శేఖర్ రాజు, అడ్వొకేట్ నిఖిల్ తో కలసి ఆయన మాట్లాడారు. ఆర్జీవీ మోసగాడని మొదట తనకు తెలియదని, అందుకే ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశానని అన్నారు. అయితే డబ్బులు ఎగగొట్టడమే పనిగా పెట్టుకున్న వర్మ తను మాకు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ,, సంతకాలను సైతం ఫోర్జరీ అని ప్రచారం చేస్తూ, తమపైనే అక్రమ కేసులు పెడుతుండటం ఆయన క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనమని నట్టి కుమార్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే తనను ఎదుర్కొనే ధైర్యం లేక,…

Actor Kiran Abbavaram’s next film goes on floors in Hyderabad   

Actor Kiran Abbavaram's next film goes on floors in Hyderabad   

The upcoming film titled ‘Rules Ranjan’ starring the happening actor Kiran Abbavaram went on floors on Friday following a pooja ceremony here in Hyderabad. The film is being produced under Star Light Entertainment Pvt Ltd . Starring Kiran Abbavaram, the film also features comedian-actor Vennela Kishore, Satya, Annu Kapoor (Bollywoood), Siddarth Sen (Bollywood), Atul Parchure (Bollywood), Ashish Vidhyardhi, Ajay among other star casts. Rathinam Krishna has penned the story and is also heming the project. The pooja ceremony was held in Hyderabad city amidst much funfare . Prominent filmmaker Krish gave the clap…

అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి : ఊట్కూరి సురేష్ గౌడ్ డిమాండ్

అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి : ఊట్కూరి సురేష్ గౌడ్ డిమాండ్

ఆలేరు : అర్హులైన బీడీ కార్మికులకు అందని పెన్షన్ అనర్హులకే అందుతుంది. అర్హులు అయిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నాయకులు, బీర్ల ఫౌండేషన్ యువజన నాయకుడు ఊట్కూరి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ … ఆలేరులో నిరుపేద అర్హులైన బీడీ కార్మికులను ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీడీలు చేసి కుటుంబాలను పోషిస్తున్న నిరుపేద ఆడపడుచులకు అర్హులైన వారి లో కొందరికి పెన్షన్ అందడం లేదు. 2017 నుండి PF కట్ అయి ఉన్న వారికి ఏమో పెన్షన్ రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ లబ్ధిదారులకు రాక దాదాపు 5 ఏండ్లనుండి నష్టపోతున్నారని, ఎందుకు ఈ…

పద్మశ్రీ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ

పద్మశ్రీ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ

తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ నగర్ లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందమూరి జయకృష్ణగారు శ్రీమతి& శ్రీ గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు గారు శ్రీ నందమూరి మాధవి మణి సాయికృష్ణ గారు శ్రీమతి లక్ష్మి హరికృష్ణ గారు శ్రీనందమూరి మోహన కృష్ణ గారు (విగ్రహ దాత) శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిగారు శ్రీమతి&శ్రీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారు శ్రీనందమూరి రామకృష్ణ గారు శ్రీమతి&శ్రీ కంటమనేని ఉమ మహేశ్వరి శ్రీనివాస ప్రసాద్ గారు శ్రీనందమూరి జయశంకర్ కృష్ణ గారు శ్రీమతి పరిటాల సునీత, జి. ఆది శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహా ఆవిష్కర్త:…

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ‘బింబిసార’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ‘బింబిసార’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్

NTR..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుుగ వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. మే 28న ఆయన జయంతి. ఆయనకు ఇది శత జయంతి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారే కాదు.. ప్రపంచంలోని తెలుగువారందరూ ఆయన శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ చిత్రం నుంచి పోస్టర్…

ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ # NBK107 మాస్ పోస్టర్ రిలీజ్

ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ # NBK107 మాస్ పోస్టర్ రిలీజ్

‘అఖండ’తో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, క్రాక్ సినిమాతో మాస్ విజయాన్ని అందుకున్న స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇంతకంటే బిగ్గెస్ట్ హిట్ అందించడానికి కలసి పని చేస్తున్నారు. #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానాయకుడు నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ చిత్రం నుండి సరికొత్త మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. టెంపుల్ బ్యాక్డ్రాప్ లో చేతిలో రక్తం చిందిన కట్టి పట్టుకొని, పిడికిలి బిగిస్తూ బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. # NBK107 లో భారీ యాక్షన్ ఎంటర్…

రామ్ ‘ది వారియర్’ చిత్రీకరణ పూర్తి

రామ్ 'ది వారియర్' చిత్రీకరణ పూర్తి

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ…

‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ప్రారంభం : నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో కొత్త చిత్రం

'బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ ప్రారంభం : నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో కొత్త చిత్రం

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు. బ్యానర్ లాంచ్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ కి శ్రీకారం చుట్టిన అన్నయ్య జయకృష్ణ గారికి అభినందనలు. ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. మా అమ్మగారు, నాన్నగారి పేర్లు కలిసోచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్ కి పేరు పెట్టడం…

‘ఛార్లి 777’ వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది : రానా ద‌గ్గుబాటి

‘ఛార్లి 777’ వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది : రానా ద‌గ్గుబాటి

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో… హీరోయిన్ సంగీత శ్రింగేరి మాట్లాడుతూ ‘‘నేను ‘ఛార్లి 777’ చిత్రంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాను. మూడు నాలుగేళ్ల ముందు సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను.…

అతి తక్కువ టికెట్ ధరలతో అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’

Adivi Sesh's Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగాఈ చిత్ర సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని మేజర్ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 147, మల్టీప్లెక్స్‌లలో 195, 177 ధరలు ఉంటాయని తెలిపారు. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రం మేజర్ కావడం విశేషం. చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో వుండటం వలన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్…