జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది : టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందంతో మంత్రి హరీష్ రావు

Journalitsjournalists

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్య భవన్ లో మంత్రితో సమావేశమై హెల్త్ కార్డుల సమస్యపై వినతి పత్రాన్ని అందించింది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు తిరస్కరణకు గురవుతుండడంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్ లో…

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ..

'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ..

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్‌ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ సినిమా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? – లక్ష్మీనారాయణ: మాది తిరుపతి దగ్గర చంద్రగిరి. పదేళ్ళ నుండి హైదరాబాద్…

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను ‘లైగర్’ తిరిగిస్తుంది : విజయ్ దేవరకొండ

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను 'లైగర్' తిరిగిస్తుంది : విజయ్ దేవరకొండ

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలవుతోంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో ‘లైగర్‌’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, కథానాయిక…

1948 Akhanda Bharath Movie Review : ‘1948 అఖండ భారత్’ ప్రతీ భారతీయుడు చూసి గర్వపడాల్సిన సినిమా!!

1948 Akhanda Bharath Movie Review : '1948 అఖండ భారత్' ప్రతీ భారతీయుడు చూసి గర్వపడాల్సిన సినిమా!!

చిత్రం :1948 అఖండ భారత్ విడుదల తేది : 12, ఆగస్టు- 2022 రేటింగ్ : 3.5/5 తారాగణం: డా.ఆర్య వర్ధన్ రాజ్ – నాథురాం గోడ్సే రఘనందన్ – గాంధీ సమ్మెట గాంధీ – అబ్దుల్ గఫార్ ఖాన్ జెన్నీ – జిన్నా ఇంతియాజ్ ఆలీ – నెహ్రు శరద్ దద్భవాల – వల్లభాయ్ పటేల్ సుహాస్ – విష్ణు కర్కరే దుర్గాప్రసాద్ – నారాయణ ఆప్టే నవీన్ మాదాసు – మదన్ లాల్ పహ్వ నాగరాజు నన్నపనేని – డా .పర్చూరేయ్ తదితరులు ముఖ్యపాత్రధారులు . దర్శకత్వం : ఈశ్వర్ బాబు – డి నిర్మాత : ఎం . వై .మహర్షి కథ : డా.ఆర్య వర్ధన్ రాజ్ కధనం : డా .ఆర్య వర్ధన్ రాజ్ సంభాషణలు : డా .ఆర్య…

‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు : కృతిశెట్టి ఇంటర్వ్యూ

actress kurhishetti interview

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో కృతిశెట్టి పంచుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర విశేషాలివి. # కరోనా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ? – నాలోని…

ఆ ఆలోచ‌న‌లో నుంచే ‘బింబిసార‌’ క‌థ పుట్టింది : దర్శ‌కుడు వ‌శిష్ట్‌ చెప్పిన సంగతులు..

bimbisara director vashist interview

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా దర్శ‌కుడు వ‌శిష్ట సినిమా గురించి విశేషాల‌ను తెలియ‌జేశారు. అవి అయన మాటల్లోనే.. – 2018లో ‘బింబిసార‌’ జ‌ర్నీ ప్రారంభ‌మైంది. సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లిన‌ట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మ‌రో పీరియడ్‌లోకి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో నుంచే ‘బింబిసార‌’ క‌థ పుట్టింది. – క‌థంతా ఓ ఫార్మేట్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ళ్యాణ్‌గారికి ‘మిమ్మ‌ల్ని ఓసారి క‌ల‌వాల‌ని అనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ పంపాను. ప‌టాస్…

‘సీతా రామం’లో సీత పాత్ర చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా : మృణాల్ ఠాకూర్‌ ఇంటర్వ్యూ

seetharamam movie heroine mrunal takoor interview

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో క‌థానాయిక మృణాల్‌ ఠాకూర్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # మీ కెరీర్ సీరియ‌ల్‌ తో మొద‌లైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయ‌డం ఎలా అనిపిస్తుంది? – నా మొద‌టి సీరియ‌ల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య‌.` అది అన్ని భాష‌ల్లో డ‌బ్ అయింది నాకు మంచి పేరు…

‘సీతారామం’ చిత్రం చరిత్రలో నిలుస్తుంది : అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ..

'సీతారామం' ల్యాండ్ మార్క్ చిత్రంగా చరిత్రలో నిలుస్తుంది: అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # సీతారామం మీ బ్యానర్ లో మరో ‘మహానటి’ అవుతుందని భావిస్తున్నారా ? – చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే…

హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం

ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్‌ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్‌ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస తాజాగా ప్రారంభించారు. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు లిక్కర్ బ్రాండ్స్ లభ్యం కానున్నాయి. హైదరాబాద్‌లో అతి పెద్ద లిక్కర్ మార్ట్‌గా పేరొందిన ఈ సూపర్‌స్టోర్‌లో‌ని బ్రాండ్స్‌కి పలు ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ‘ML’ ప్రీమియమ్ లగ్జరీ లిక్కర్ మార్ట్ సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రవి కుమార్ పనస మాట్లాడుతూ.. ‘‘ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ మార్ట్‌ ‘ML’‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు బ్రాండ్స్‌ను హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉంచడం జరిగింది.…

ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీ 'పసలపూడి కథలు'పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతో ఫేమస్. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ‘పసలపూడి’  వంశీ సొంతూరు. దానికి సమీపంలోని ‘గొల్లల మామిడాడ’ కె. రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పసలపూడి కథలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకని, తన పీహెచ్‌డీకి పరిశోథనాంశంగా ఎంచుకున్నారు. ఆయనదీ గోదావరే కాబట్టి అక్కడి యాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. వంశీ ‘పసలపూడి కథలు’పై పీహెచ్‌డీ చేసిన…