స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం సంబధించి హ్యుజ్ కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. 75 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యుల్ లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కాశ్మీర్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నాయి. SK21 శివకార్తికేయన్ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. ‘గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్…
Category: Entertainment
డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ‘జీబ్రా’
సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్. సినిమాలు భారీ రేంజ్లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్గానే పర్ఫార్మ్ చేస్తుంటాయి. ప్రస్తుతం సత్యదేవ్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ’జీబ్రా’ ఒకటి. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు. కెరీర్ బిగినింగ్ నుంచి సత్యదేవ్ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు.. సత్యదేవ్ కూడా తన రోల్కి డబ్బింగ్ చెబుతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా ‘జీబ్రా’ చిత్రం…
‘ఓజీ’ టీజర్ పై అభిమానుల్లో ఆత్రుత!
ఒక టీజర్ కోసం ఈ రేంజ్లో హడావిడి ఎప్పుడూ చూడలేదు. కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎగ్జైట్ అవుతారో ‘ఓజీ’ టీజర్ గురించి కూడా అదే స్థాయిలో ఎగ్జైట్కు గురవుతున్నారు. దానికి తగ్గట్లే మేకర్స్ సైతం టీజర్ గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇస్తూ ఎక్కడలేని హైప్ను తీసుకొస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న టీజర్ వస్తుందని తెలుసు కానీ.. ఫలానా టైమ్ అని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. దీని గురించి ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ డీవివి సంస్థను ట్యాగ్ చేసి టైమ్ చెప్పండంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి డీవివి సంస్థ ఫ్యాన్స్కు గాడ్ లెవల్ రిప్లయి ఇచ్చింది. పవన్ బర్త్డేన అంతా పండగే కాబట్టి మీరే చెప్పండి సెప్టెంబర్ 2న ఏ టైమ్కు టీజర్ రిలీజ్ చేద్దామో అని పోస్ట్ చేసింది. అంతేకాకుండా…
‘జనగణమన’ ప్రాజెక్ట్…పట్టాలు తప్పలేదు!
పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత మహేష్తో మరో సినిమా చేయాలని పూరి ‘జనగణమన’ కథను రాసుకున్నాడు. టైటిల్ను కూడా రిజస్టర్ చేయించాడు. అయితే మహేష్తో ఈ సినిమా తీయాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు జరిపినా వర్కవుట్ అవలేదు. దాంతో ప్రతీ ఏటా ఆ టైటిల్ను రిన్యువల్ చేస్తూ వస్తున్నాడు. ఇక అన్ని కుదిరి రౌడీ స్టార్ విజయ్తో ఈ సినిమాను పట్టాలెక్కించాడు. లైగర్ చేస్తున్న టైమ్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూట్ కూడా చేశాడు. యుద్ద విమానాలు, సైనికులు, మిస్సైల్స్, బులెట్లతో ఓ పోస్టర్ను రిలీజ్ చేస్తూ…
‘భోళాశంకర్’ దర్శకుడు మెహెర్ రమేష్ ఎక్కడ..?
మళ్ళీ దర్శకుడిగా కనపడే ఛాన్స్ ఉందా? సినిమా ఫెయిల్యూర్తో మెహెర్ రమేష్పై సెటైర్ల వర్షం! దర్శకుడు మెహెర్ రమేష్ కి దాదాపు పదేళ్ల తరువాత ఒక మంచి అవకాశం వచ్చింది.. అదే ఒక సినిమా దర్శకత్వం చేయడానికి. అది కూడా మామూలు సినిమా కాదు, సాక్షాత్తూ మెగాస్టార్ కథానాయకుడిగా చేస్తాను అన్నారు. అంటే మెహెర్ కి ఇది ఒక గొప్ప అవకాశం. కథ కూడా వెతుక్కో అక్కరలేకుండా తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్ చేసుకోమన్నారు. అదే ‘భోళా శంకర్’ సినిమా. చిరంజీవి కథానాయకుడు, తమన్నా కథానాయిక. కీర్తి సురేష్ ఇందులో చిరంజీవికి చెల్లెలు గా చేసింది. ఇంత పెద్ద బ్జడెట్ సినిమా రావటం మెహెర్ రమేష్ కి జీవితంలో రాని గొప్ప అవకాశం, కానీ వచ్చింది, అయితే.. దాన్ని సరిగ్గా…
భారీ డీల్ కు ‘స్కంద’ సినిమా హక్కులు!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ’స్కంద’ సెప్టెంబర్ 15న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, అందులో బోయపాటి మార్కు అదే నరుక్కునే సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీలీల కథానాయకి, థమన్ సంగీతం అందించాడు, ఈ సినిమాలో పాటలు వైరల్ అయ్యాయి కూడా. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చి సినిమా యూనిట్ కి విషెస్ చెప్పాడు. అలాగే ఇందులో సాయి మంజ్రేకర్ కూడా వుంది. ఇదిలా ఉండగా..ఈ సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమా సాటిలైట్, ఓటిటి చానెల్స్ తో మంచి డీల్ కుదుర్చుకున్నాడు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఓటిటి, అలాగే సాటిలైట్ హక్కులు డిస్నీ ప్లస్…
నవంబర్ 2న విడుదలకు సిద్ధమైన ‘మా ఊరి పొలిమేర -2’
శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 2న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో చేశాం. ఇటీవల మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ కు మంచి…
కేథరిన్ థెరిసా – సందీప్ మాధవ్ జంటగా నటిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!!
“జార్జిరెడ్డి, వంగవీటి’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ మరొక డిఫెరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థెరిసా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మహా విష్ణువు మూవీస్, పల్లి పైడయ్య ఫిలిమ్స్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ అశోక్ తేజ (ఓదెల రైల్వే స్టేషన్) ఫేమ్ దర్శకత్వంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. *ఈ చిత్ర విశేషాలను నిర్మాతల్లో ఒకరైన దావులూరి జగదీశ్ తెలుపుతూ* “కేథరిన్, సందీప్ మాధవ్, కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.…
సంక్రాంతికి బీడీల గోల.. మహేష్, నాగ్ల చిత్రాల పోస్టర్లపై చర్చ
మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వేగం చూస్తుంటే, సంక్రాంతికి అనుకున్న తేదీకి మహేష్ బాబు సినిమా విడుదల అవొచ్చు అని అంటున్నారు. అంత వేగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. చాలామంది కాంబినేషన్ నటులు వున్నా, అందరికీ ముందే చెప్పి పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ కోసం మూడు హౌస్ సెట్లు వేశారని, ఎవరు దొరికితే ఆ సంబంధిత ఇంట్లో షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. కథానాయకుడు అయిన మహేష్ బాబు హౌస్ సెట్, అలాగే ప్రకాష్ రాజ్ ఆఫీస్ సెట్, ఇంకోటి కథానాయిక అయిన శ్రీలీల హౌస్ సెట్ ఇలా మూడు సెట్లు వేశారని, కాంబినేషన్ చూసుకుంటూ చక చకా షూటింగ్ చేసేస్తున్నారని కూడా తెలిసింది. ఇందులో ప్రకాష్…
రామ్ ‘స్కంధ’పై భారీ అంచనాలు… ప్రమోషన్స్పై దృష్టి పెట్టిన మేకర్స్!
వినాయక చవితికి నాలుగు రోజుల ముందే రిలీజవుతున్న ‘స్కంద’ సినిమాపై మాస్ ఆడియెన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇక ఈ రెండు వారాల పాటు చిత్రయూనిట్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు జరుపనుందట. పైగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తుండటంతో అన్నీ భాషల్లో ప్రెస్మీట్లను నిర్వహించాలని మేకర్స్ గట్టి ప్లాన్ లే చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే…
