సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది. ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుందన్నది స్పష్టం. అందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన…
Category: Entertainment
”Reality is wrong. Dreams are for real”
“A picture is worth a thousand words”. Life’s journey is all about dreaming and doing something to achieve that dream. The ability to imagine something larger than life forms the essence of living. ‘Kala’ is a musical attempt to depict the dream of many. ‘Kala’ is a musical video song, shot in picturesque locations of Goa and Hyderabad. Featuring the promising and beautiful actress Heena S, the song is rendered by the well-known singer Neha Karode. As we are about to step into a new year filled with many aspirations,…
హీరోగా మారుతున్న నటుడు అభినవ్ గోమఠం!!
మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.
జనవరి 14 ‘రాధే శ్యామ్’ విడుదలలో మార్పులేదు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా భారీ సినిమా ‘రాధే శ్యామ్’. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా వచ్చే సంక్రాంతి రేస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా న్యూఇయర్ పెను మార్పులతో ఆరంభమయింది. అయితే.. సంక్రాంతి బరిలో ఉన్న భారీ సినిమా ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా పడడంతో చిత్రసీమ షేక్ అయింది. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ వెనక్కి వెళితే.. ‘రాధే శ్యామ్’ కూడా విడుదల వాయిదా పడడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక అంశాలతో టాలీవుడ్ రగులుతుండగా ఒక కూల్ పోస్టర్ తో ‘రాధే శ్యామ్’ యూనిట్ మాత్రం సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటిస్తూ జనవరి 14 డేట్ ని ఈ…
విడుదలకు సిద్దమైన ‘హలో జూన్’
ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ పై మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ ‘హలో జూన్’. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..”ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్…
ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా!
ఇప్పుడు టాలీవుడ్ లో అంతా అయోమాయం చోటుచేసుకుంది. జనవరి 7న వస్తుందనుకున్న ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదాపడడంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమైన ట్రిపుల్ ఆర్ విడుదల కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కొంత కాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విడుదలకు పకడ్భంది ఏర్పాట్లు చేసారు. అయితే.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రానికి కరోనా, ఒమిక్రాన్ ల దెబ్బ తగిలి విడుదల వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కరోనా మూడో దశ ప్రారంభమయింది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహరాష్ట్రలో అయితే.. కరోనా ఫలితంగా తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
Detective Satyabhama Movie Review : అందరికీ నచ్చే’డిటెక్టీవ్ సత్యభామ’
చిత్రం :’డిటెక్టివ్ సత్యభామ సంగీతం, దర్శకత్వం: నవనీత్ చారి టాలీవుడ్ టైమ్స్ రివ్యూ రేటింగ్ :3.25/5 నటీ నటులు : సోనీ అగర్వాల్, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్,కార్తిక్ తేజ రెడ్డి తదితరులు. బ్యానర్ : సిన్మా ఎంటర్టైన్మెంట్ నిర్మాత : శ్రీశైలం పోలె మోని కెమెరా&ఎడిటర్: లక్కీ ఏకరి డైలాగ్ : సంతోష్ ఇంగాని పి.ఆర్.ఓ : ఆర్.కె. చౌదరి సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం…
సింగీతం శ్రీనివాసరావు తీసిన ‘దిక్కట్ర పార్వతి’కి అరుదైన గౌరవం
జనవరి 1న చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా ప్రత్యేక ప్రదర్శన భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చెన్నైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ‘దిక్కట్ర పార్వతి’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ‘దిక్కట్ర పార్వతి’కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్లోని కోర్టులో సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో రియల్ లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన ఓ పాటతో పాటు రాజాజీ…
సందడిగా సాగిన ‘మహానటులు’ మూవీ పోస్టర్, క్యారెక్టర్ రివీల్
మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ హిట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మాతలు. మహానటులు పోస్టర్ లాంఛ్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…అశోక్ నేనూ మహేష్ కత్తి, సుధీర్ వర్మ రెగ్యులర్ గా కలిసేవాళ్లం. అశోక్ ఏ…
ఫేక్ లెటర్స్ నిగ్గు తేల్చండి : నట్టి కుమార్ విజ్ఞప్తి
టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ ఫేక్ లెటర్లు పెట్టిన వారిపై, వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లకు సంబంధించి తెచ్చిన జీవో 35ను రద్దు చేయించాలని పూసర్ల బాబు బాబ్జీ అనే వ్యక్తి ఇటీవల ఏపీ హైకోర్టుకెక్కారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్స్ జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ, ఫేక్ లెటర్స్ సృష్టించి జీవో 35 రద్దు విషయంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. నా అంగీకారం లేకుండా నా థియేటర్ పైన కూడా ఫేక్ లెటర్లు సృష్టించి, నా థియేటర్…
