ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిచిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకసంచలనం వి.వి.వినాయక్ విడుదల చేసి, ట్రైలర్ అద్భుతంగా ఉందని… సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన…
Category: Entertainment
ఏపీ సీఎం జగన్ గారి ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది : కైకాల సత్యనారాయణ
గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను…
Akhanda-BalaKrishna : రూ. 200 కోట్ల క్లబ్ లో ‘అఖండ’ : 50 డేస్ 103 థియేటర్స్..
50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ చూసి ఎన్నాళ్ళయింది? ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా ఫస్ట్ వీక్లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ‘అఖండ’ విజయం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బస్టర్ ని కైవసం చేసుకుని చరిత్రని తిరగరాసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో విజయవిహారం చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్…
ఈ ఏడాది మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు రాబోతోన్నాను : డా. నరేష్ విజయకృష్ణ
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే పుట్టిన రోజు (జనవరి 20) సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాతో ముచ్చటించారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ప్రస్థావించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతుండటంతో.. ఈ ఏడాది నుంచి తన నిర్మాణ సంస్థలో కొత్త సినిమానులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా… నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ – ‘జనవరి 20 నా పుట్టిన రోజు. నా అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరితో కలిసి జరుపుకుంటాను. కానీ రమేష్ని మిస్ అవుతున్నాం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బర్త్ డేను సెలెబ్రేషన్స్ చేసుకోవడం లేదు. నా జీవితంలో జరిగే వాటిని ఇలా పంచుకోవడం సహజం. అందుకే ఇలా కలుస్తాను. 1972లో పండంటి కాపురం సినిమాతో తెరంగేట్రం…
పండగలా జరిగిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఫస్ గయే యారో’ ప్రి-రిలీజ్ ఫంక్షన్ !!
# హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్ # ప్రఖ్యాత నిర్మాణ-పంపిణీ సంస్థ రాజశ్రీ ఫిల్మ్స్ ద్వారా విడుదల!! హైదరాబాద్ బిర్యానీలాంటి పసందైన వినోదం పంచేందుకు ఈనెల న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాన్ ఇండియా ఫిల్మ్ “ఫస్ గయే యారో”. “అబ్ ఆయేగీ కిస్కీ బారి?” ట్యాగ్ లైన్ తో ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత రూపేష్ డి.గోహిల్ నిర్మించిన ఈ హిలేరియస్ హర్రర్ ఎంటర్టైనర్ కి యూసఫ్ సర్తి దర్శకత్వం వహించగా… డెక్కన్ సూపర్ స్టార్ మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు సయ్యద్ హుస్సేన్ సారధ్యంలో హైదరాబాద్-ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన “ఫస్ గయే యారో”…
నిధి లిస్టులో పలు క్రేజీ ప్రాజెక్టులు!
తన కొత్త సినిమా “హీరో”తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్, నటన ఆకట్టుకుంటోంది. హీరో విజయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమాలో నిధి పర్మార్మెన్స్ పై ప్రేక్షకులే కాదు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడు జగపతి బాబు తనకు మళ్లీ హీరో కావాలని కోరిక ఉందని, ఎందుకంటే తనకు హీరోయిన్ గా నిధి అగర్వాల్ దొరికే అవకాశం ఉండొచ్చని చెప్పారు. నిధి అందంగా ఉండటమే కాదు థియేటర్లో తన పర్మార్మెన్స్ కు వస్తున్న అప్లాజ్ ఆకట్టుకుందని చెప్పారు. మరో నటుడు నరేష్ అయితే నిధి అగర్వాల్ కున్న క్రేజ్ చూస్తుంటే మళ్లీ జన్మలో ఆమెలా…
రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ లో సరికొత్త రికార్డు!
రియల్ హీరో సోనూసూద్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇటీవల కాలంలో కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలిచాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో వలస కూలీల కు అండగా నిలబడి… వారిని స్వగ్రామాలకు తరలించాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాడు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ కూడా తన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక సోను పై ఉన్న అభిమానంతో చాలామంది ఫ్యాన్స్ గుడులను కూడా కట్టారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు సోనూసూద్. ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లను దాటింది. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో సోనూసూద్ ఒకడిగా నిలవటం విశేషం!!
కొత్త జంటలపై ఆసక్తి !
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి 2022 ప్రారంభంలో తమ చిత్రాలద్వారా కనువిందు చేసే కొత్త జంటలపై పడింది. అందరినీ ఉత్తేజపరిచే ఈ ఆన్స్క్రీన్ జోడీలతో ఆసక్తి నెలకొంది. ఈ 2022 ఖచ్చితంగా బాలీవుడ్-టాలీవుడ్ లో కొత్త జంటలు మరియు కొత్త వెండితెర జోడీల సంవత్సరం కానుంది. థియేటర్ల పునఃప్రారంభం.. ఓటీటీ చలనచిత్రాల ప్రవాహం మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్కు దారితీసింది. తద్వారా ఇంతకు ముందెన్నడూ చూడని నటులు, నటీమణులను వెండితెరపై వీక్షించబోతున్నాం. ఆ జంటలేమిటో ఓసారి లుక్కేద్దాం… రామ్ చరణ్- అలియా భట్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’లో రామ్ చరణ్- అలియా భట్ జంట కన్నులపంట కానుంది. ఈ జోడీ కోసం సినీ ప్రేక్షకులే కాదు.. అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాఫ్ట్ అండ్ విధేయత కలిగిన అలియా…
Nidhi Agerwal: నిధి అగర్వాల్ రెమ్యూనరేషన్ పెంచేసింది!?
అందాలతార హాట్ బేబీ నిధి అగర్వాల్ సినిమాల స్పీడు పెంచడమే కాదు.. దాంతో పాటు తన రెమ్యూనరేషన్కూడా భారీగానే పెంచేసిందట. ఆకట్టుకునే నటన, గ్లామర్తో యువతరాన్ని కట్టిపడేస్తున్న ఈబ్యూటీ ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ నిధి అందచందాలకు మాత్రం మంచి ప్రశంసలే లభించాయి. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ‘ఇస్మార్ట్ శంకర్’తో కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుంది. ఈ భామ తెలుగులో తాజాగా నటించిన చిత్రం ‘హీరో’. యంగ్ హీరో అశోక్ గల్లాతో జోడీ కట్టిన నిధి ఈ సినిమా కోసం బాగానే డిమాండ్ చేసిందట. ఇప్పటివరకు రూ.50 నుంచి 80 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న నిధి ఈ సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్నర తీసుకున్నట్లు సమాచారం. తన కెరీర్లోనే తొలిసారిగా ఓ సినిమాకు…
ధనుష్, ఐశ్వర్యల విడాకులకు కారణం ఇదా!?
ధనుష్, ఐశ్వర్యలు కోలీవుడ్లో చూడచక్కని జంటగా పేరుతెచ్చుకున్నారు. అయితే హఠాత్తుగా వీళ్ళిద్దరూ విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికామని, ఇప్పుడు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ సోషల్ మీడియా వేదికగా ధనుష్, ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే…
