సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది.. అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు.. అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారనితేలింది. క్షణికానందం కోసం అడ్డొస్తే అది ఎవరనేది కూడా చూడకుండా క్షణికావేశంలో చంపు కుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి కథలను ఎవ్వరూ ధైర్యం చేయలేని విధంగా బోల్డ్ గా పక్కాగా తెర కి ఎక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని ఎన్నో సినిమాలు నిరూపించాయి .…
Category: Entertainment
‘రుద్రాక్షపురం’తో నా స్థాయి పెరుగుతుంది : యువ హీరో మణి సాయితేజ
‘రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది అన్నారు యువకెరటం హీరో మణి సాయితేజ. మాక్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కొండ్రసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటిస్తున్న తనకు చాలా మంచి పాత్ర లభించిందని, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మణి సాయితేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్.కె. గాంధీగారి దర్శకత్వంలో ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఇంతకుముందు ‘బ్యాట్ లవర్స్’ మూవీలో హీరోగా చేశాను. ఆ చిత్రంతో అందరికీ పరిచయమైన నేను.. ఇప్పుడు చేస్తున్న ‘రుద్రాక్షపురం’ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్రకి…
మా తొలి ప్రయత్నం `హీరో`ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : నిర్మాత గల్లా పద్మావతి
అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలయి పాజటివ్ టాక్ ను సంతరించుకుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ తమ ఆనందాన్ని సంస్థ కార్యాలయంలో విలేకరులతో పంచుకున్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చాలా రోజుల తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల ఎనర్జీని చూశాను. అది మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అన్ని ఏరియాల్లో సూపర్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. హీరో అశోక్ను చూసిన వారంతా మాస్ హీరో అంటూ సంబోధిస్తూ, అశోక్కు ఇది మొదటి సినిమాలా లేదని అంటున్నారు. మాకు సంక్రాంతి విజయం దక్కింది. మీకూ సంక్రాంతి…
aha’s Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch
100% Telugu streaming platform aha is going all out in its attempt to unearth the best Telugu singing talents with its singing competition, Telugu Indian Idol, to be hosted by singing sensation Sreerama Chandra. The online auditions for Telugu Indian Idol, the first-ever Indian Idol competition to be held in South India, co-powered by Instagram, had commenced on January 7 and the response for it has been unprecedented, to say the least. Fremantle is also a brand partner. Budding Telugu singers and musicians from nooks and corners across the globe…
తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్కి హ్యూజ్ రెస్పాన్స్: లాంచ్ చేసిన కొన్ని రోజులకే 5000 ఎంట్రీలు
100 % తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆహా… తన తదుపరి షో తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశయంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్రతిభను వెలికితీయడానికి, సరైన వేదిక కల్పించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. ఈ కార్యక్రమాన్ని సింగింగ్ సెన్సేషన్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడిల్కు ఆన్ లైన్ ఆడిషన్స్ను రీసెంట్గా నిర్వహించారు. దక్షిణాదిన నిర్వహించిన ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్. ఆహా..ఇన్స్టాగ్రామ్ వారి కో పవర్డ్గా జనవరి 7 నుంచి ఆడిషన్స్ జరిగాయి. దీనికి అపూర్వమైన స్పందన వచ్చింది. వర్ధమాన గాయకులు, సంగీతకారులు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారందరూ తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్కు ఆన్లైన్…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియన్ ‘మైఖెల్’ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్
సందీప్ కిషన్ పలు భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. మంచి స్క్రిప్ట్లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేస్తోన్న ప్రతీ అనౌన్స్మెంట్తో అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు. స్టార్ డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్…
మాస్ మహరాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’
మాస్ మహారాజ రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” .. ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. రవితేజ పై చిత్రీకించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ నివ్వగా, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కే.యస్.రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు.. రావణాసుర పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ వైట్ షర్ట్ కోటు వేసుకొని సిగరెట్ వెలిగి స్తుండగా షర్ట్ పై…
ఇప్పడు ‘రాధే శ్యామ్’ పరిస్థితి ఎలా ఉందంటే..?
‘ట్రిపుల్ ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు వచ్చేశాయి. మార్చి 18 లేదంటే… ఏప్రిల్ 28న ఈసినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇది ఊహించిన పరిణామమే. ఎందుకంటే ఏప్రిల్ 28న ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతుందని ట్రేడ్ వర్గాలు ముందే ఊహించాయి. ఆర్.ఆర్.ఆర్ కి తగిన స్లాట్ అక్కడే ఉంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ చెప్పేసి, చేతులు దులుపుకున్నాడు గానీ, ఇప్పుడు మిగిలిన సినిమాలన్నీ ఒత్తిడిలో పడిపోయాయి. ముఖ్యంగా రాధేశ్యామ్. టాలీవుడ్ లో తెరకెక్కిన రెండు భారీ చిత్రాలు ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ సంక్రాంతికి వద్దామనుకుని వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ వీలైనంత త్వరగా రావాలి. లేదంటే.. వడ్డీల భారం మోయలేక ఇబ్బంది పడాల్సి వుంటుంది. అందుకే ముందుగా రాజమౌళి రంగంలోకి దిగిపోయాడు. తన సినిమా రిలీజ్…
వరలక్ష్మీ శరత్కుమార్ ఇక పాన్ ఇండియా స్టార్!!
నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్లతో దూసుకెళుతున్న వరలక్ష్మీ శరత్కుమార్ తాజాగా ‘మైఖెల్’ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విలన్ గ్యాంగ్లో రౌడీ లేడీ, న్యాయం చేయడానికి కృషి చేసే లాయర్ లాంటి పాత్రలతో యమబిజీగా దూసుకెళుతోంది. సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మైఖెల్’. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సందీప్ కిషన్ పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్గా…
RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు రెండు రిలీజ్ డేట్స్ ఫిక్స్
కరోనా థర్డ్ వేవ్, కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ తదితర కారణాలతో వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త విడుదల తేదీతో చిత్ర బృందం కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసి తెలిపారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, చరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రధారులు. కీరవాణి సంగీతం అందించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన…
